కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తెలుగులో ‘సార్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు సడెన్ గా షూటింగ్ కి బ్రేక్ పడింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిందని చెబుతోంది చిత్రబృందం. కానీ అసలు కథ వేరే అట.
కొన్నిరోజులుగా ధనుష్ ఆరోగ్యం పాడవ్వడంతో వెంటనే టెస్ట్ లు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ అని తేలిందట. వెంటనే షూటింగ్ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. వారం, పది రోజుల పాటు ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఆ తరువాత షూటింగ్ మొదలుపెడతారేమో చూడాలి. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం.
కథ ప్రకారం.. భారీ సెట్లు, డిఫరెంట్ లొకేషన్స్ తో పని లేదని తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మధ్యనే ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకే హోటల్ లో ఉంటున్నారని సమాచారం. ఐశ్వర్య ఓ సాంగ్ షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on January 24, 2022 5:38 pm
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…