కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తెలుగులో ‘సార్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు సడెన్ గా షూటింగ్ కి బ్రేక్ పడింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిందని చెబుతోంది చిత్రబృందం. కానీ అసలు కథ వేరే అట.
కొన్నిరోజులుగా ధనుష్ ఆరోగ్యం పాడవ్వడంతో వెంటనే టెస్ట్ లు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ అని తేలిందట. వెంటనే షూటింగ్ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. వారం, పది రోజుల పాటు ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఆ తరువాత షూటింగ్ మొదలుపెడతారేమో చూడాలి. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం.
కథ ప్రకారం.. భారీ సెట్లు, డిఫరెంట్ లొకేషన్స్ తో పని లేదని తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మధ్యనే ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకే హోటల్ లో ఉంటున్నారని సమాచారం. ఐశ్వర్య ఓ సాంగ్ షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…