కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తెలుగులో ‘సార్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు సడెన్ గా షూటింగ్ కి బ్రేక్ పడింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిందని చెబుతోంది చిత్రబృందం. కానీ అసలు కథ వేరే అట.
కొన్నిరోజులుగా ధనుష్ ఆరోగ్యం పాడవ్వడంతో వెంటనే టెస్ట్ లు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ అని తేలిందట. వెంటనే షూటింగ్ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. వారం, పది రోజుల పాటు ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఆ తరువాత షూటింగ్ మొదలుపెడతారేమో చూడాలి. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం.
కథ ప్రకారం.. భారీ సెట్లు, డిఫరెంట్ లొకేషన్స్ తో పని లేదని తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మధ్యనే ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకే హోటల్ లో ఉంటున్నారని సమాచారం. ఐశ్వర్య ఓ సాంగ్ షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on January 24, 2022 5:38 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…