ఓటీటీ.. ఓటీటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. లాక్ డౌన్ నడుస్తుండటంతో మూడు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఇంకో మూణ్నాలుగు పాటు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేయడానికి జోరుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ‘అమృతారామ్’ అనే ఓ చిన్న సినిమాను రెండు నెలల కిందట రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమా మహేశ్వరరావు ఉగ్రరూపస్య చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్లోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. రిలీజ్ డేట్ మాత్రమే తేలాల్సి ఉంది. ఇప్పుడు మరో సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ అయింది. అది కూడా సత్యదేవ్ సినిమానే కావడం విశేషం.
సత్యదేవ్ హీరోగా ప్రదీప్ మద్దాలి అనే కొత్త దర్శకుడు రూపొందించిన థ్రిల్లర్ మూవీ 47 డేస్ త్వరలోనే జీ5లో రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దాదాపు ఏడాది కిందటే ఈ చిత్రం పూర్తయింది. విడుదల విషయంలో సమస్యలెదుర్కొంది. ఇక రిలీజ్ కాదేమో అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసి ఓ పనైపోయింది బాబూ అనిపిస్తున్నట్లుగా ఉంది. కొన్ని రోజులుగా ఓటీటీల్లో వరుసగా కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. గత నెల చివర్లో జ్యోతిక తమిళ సినిమా పొన్ మగల్ వందాల్ రిలీజ్ కాగా.. శుక్రవారమే హిందీ మూవీ గులాబో సితాబోను విడుదల చేశారు. 19న కీర్తి సురేష్ మూవీ పెంగ్విన్ రానుంది. కన్నడ సినిమాలు ‘లా’, ‘ఫ్రెంచ్ బిరియాని’ మలయాళ చిత్రం ‘సుఫియుం సుజాతయుం’, హిందీ మూవీ ‘శకుంతలా దేవి’ కూడా త్వరలోనే అమేజాన్ ప్రైంలోకి రానున్నాయి.
This post was last modified on June 13, 2020 2:46 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…