ఓటీటీ.. ఓటీటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. లాక్ డౌన్ నడుస్తుండటంతో మూడు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఇంకో మూణ్నాలుగు పాటు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేయడానికి జోరుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ‘అమృతారామ్’ అనే ఓ చిన్న సినిమాను రెండు నెలల కిందట రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమా మహేశ్వరరావు ఉగ్రరూపస్య చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్లోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. రిలీజ్ డేట్ మాత్రమే తేలాల్సి ఉంది. ఇప్పుడు మరో సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ అయింది. అది కూడా సత్యదేవ్ సినిమానే కావడం విశేషం.
సత్యదేవ్ హీరోగా ప్రదీప్ మద్దాలి అనే కొత్త దర్శకుడు రూపొందించిన థ్రిల్లర్ మూవీ 47 డేస్ త్వరలోనే జీ5లో రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దాదాపు ఏడాది కిందటే ఈ చిత్రం పూర్తయింది. విడుదల విషయంలో సమస్యలెదుర్కొంది. ఇక రిలీజ్ కాదేమో అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసి ఓ పనైపోయింది బాబూ అనిపిస్తున్నట్లుగా ఉంది. కొన్ని రోజులుగా ఓటీటీల్లో వరుసగా కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. గత నెల చివర్లో జ్యోతిక తమిళ సినిమా పొన్ మగల్ వందాల్ రిలీజ్ కాగా.. శుక్రవారమే హిందీ మూవీ గులాబో సితాబోను విడుదల చేశారు. 19న కీర్తి సురేష్ మూవీ పెంగ్విన్ రానుంది. కన్నడ సినిమాలు ‘లా’, ‘ఫ్రెంచ్ బిరియాని’ మలయాళ చిత్రం ‘సుఫియుం సుజాతయుం’, హిందీ మూవీ ‘శకుంతలా దేవి’ కూడా త్వరలోనే అమేజాన్ ప్రైంలోకి రానున్నాయి.
This post was last modified on June 13, 2020 2:46 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…