ఓటీటీ.. ఓటీటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. లాక్ డౌన్ నడుస్తుండటంతో మూడు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఇంకో మూణ్నాలుగు పాటు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేయడానికి జోరుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ‘అమృతారామ్’ అనే ఓ చిన్న సినిమాను రెండు నెలల కిందట రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమా మహేశ్వరరావు ఉగ్రరూపస్య చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్లోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. రిలీజ్ డేట్ మాత్రమే తేలాల్సి ఉంది. ఇప్పుడు మరో సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ అయింది. అది కూడా సత్యదేవ్ సినిమానే కావడం విశేషం.
సత్యదేవ్ హీరోగా ప్రదీప్ మద్దాలి అనే కొత్త దర్శకుడు రూపొందించిన థ్రిల్లర్ మూవీ 47 డేస్ త్వరలోనే జీ5లో రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దాదాపు ఏడాది కిందటే ఈ చిత్రం పూర్తయింది. విడుదల విషయంలో సమస్యలెదుర్కొంది. ఇక రిలీజ్ కాదేమో అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసి ఓ పనైపోయింది బాబూ అనిపిస్తున్నట్లుగా ఉంది. కొన్ని రోజులుగా ఓటీటీల్లో వరుసగా కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. గత నెల చివర్లో జ్యోతిక తమిళ సినిమా పొన్ మగల్ వందాల్ రిలీజ్ కాగా.. శుక్రవారమే హిందీ మూవీ గులాబో సితాబోను విడుదల చేశారు. 19న కీర్తి సురేష్ మూవీ పెంగ్విన్ రానుంది. కన్నడ సినిమాలు ‘లా’, ‘ఫ్రెంచ్ బిరియాని’ మలయాళ చిత్రం ‘సుఫియుం సుజాతయుం’, హిందీ మూవీ ‘శకుంతలా దేవి’ కూడా త్వరలోనే అమేజాన్ ప్రైంలోకి రానున్నాయి.
This post was last modified on June 13, 2020 2:46 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…