కారు షోరూంలోకి ఒక రైతు వెళ్లాడు. కారు ధర అడిగాడు. దీంతో సిబ్బంది ఆయనను ఇన్సల్ట్ చేశారు. “కారు ధర చెప్పాలా? ఇది పావలా అర్ధ రూపాయి కాదు!“ అంటూ అవహేళనగా మాట్టాడారు. ఆ తర్వాత.. ఇక్కడ చిరంజీవి నటించిన సినిమాలోని ఒక సీన్ కనిపించింది. దీంతో సిబ్బంది అవాక్కయ్యారు.. స్నేహం కోసం సినిమాలో పంచకట్టులో.. చిరంజీవి, విజయ్ కుమార్ కలిసి ఓ కార్ల షోరూమ్కు వెళ్తారు.
వారిని చూసి అక్కడి మేనేజర్ అవమానిస్తాడు. కారు కొనే ముఖాలేనా? అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత.. గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు తీయగా ఆశ్చర్యానికి గురై తన తప్పును తెలుసుకుని కారును విక్రయిస్తాడు. ఇలాంటి సీనే కర్ణాటకలోని ఓ మహీంద్రా షోరూమ్లో జరిగింది. మహీంద్రా బొలెరో కొనేందుకు ఓ రైతు షోరూమ్కు వెళ్లగా.. అక్కడి సేల్స్మ్యాన్ అవమానించాడు.
కర్ణాటక, తుముకూర్లోని ఓ మహీంద్రా కార్ల షోరూమ్కు కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వస్త్రాలంకరణను హేళన చేస్తూ అక్కడి సేల్స్మ్యాన్ అవమానించాడు. కారు ధర మీరనుకున్నట్లు 10 రూపాయలు కాదంటూ వారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. రైతును ఉద్దేశిస్తూ సేల్స్మ్యాన్ అసభ్యకరంగా మాట్లాడాడు.
తమ వస్త్రధారణ చూసి అవమానించిన సేల్స్మ్యాన్కు రైతు.. ధీటైన సమాధానమిచ్చారు. గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు చేసిన ప్రతీకార చర్యతో షాక్కు గురైన షోరూమ్ సిబ్బంది.. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు. అక్కడి నుంచి వెళ్లిన రైతు.. తుముకూర్లోని తిలక్నగర్ పోలీస్ స్టేషన్లో షోరూమ్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. చివరకు షోరూమ్ సేల్స్మ్యాన్, ఇతర ఉద్యోగులు కెంపెగౌడకు క్షమాపణలు చెప్పారు. రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.. వివాదానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఈ ఘటన తాలూకు వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది.
This post was last modified on January 23, 2022 8:19 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…