ఇండియన్ సినిమాలో దశాబ్దాల నుంచి బాలీవుడ్దే ఆధిపత్యం. వేరే దేశాల వాళ్లు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అనుకుంటారు. ఇక్కడ వేర్వేరు భాషల్లో సినిమాలు తెరకెక్కుతుంటాయని.. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ లాంటి పేరున్న ఇండస్ట్రీలున్నాయని కూడా ఒకప్పుడు తెలిసేదే కాదు. ఇక బాలీవుడ్ వాళ్లు కూడా వేరే భాషల చిత్రాలను తక్కువగా చూసే పరిస్థితి ఉండేది. మన సినిమాల్ని చూసి వెటకారాలు కూడా చేసేవారు. సౌత్ సినిమాలను అసలుతమకు పోటీగానే ఎప్పుడూ భావించేవారు కాదు.
వసూళ్ల పరంగా చూసినా, అవార్డుల్లో చూసినా ఆధిపత్యమంతా బాలీవుడ్ వాళ్లదే. కానీ ఇదంతా ‘బాహుబలి’కి ముందు కథ. ఆ సినిమా ఉత్తరాదిన ప్రభంజనం సృష్టించాక కథ మొత్తం మారిపోయింది. జియో ఇంటర్నెట్ పుణ్యమా అని సౌత్ మసాలా రుచేంటో ఉత్తరాది వాళ్లకు బాగా అర్థమైంది. కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలతో నార్త్ ఇండియాలో సౌత్ సినిమాల హవా ఇంకా పెరిగిపోయి హిందీ సినిమాల అస్తిత్వమే ప్రమాదంలో పడింది.
ఒకప్పుడు హిందీ సినిమాలకు రిలీజ్ డేట్లు ఖరారు చేసే విషయంలో బాలీవుడ్ వాళ్లకు ఎలాంటి తలనొప్పులూ ఉండేవి కావు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని డేట్లు ఖరారు చేసేవారు. ఒక పెద్ద సినిమాకు ఒక డేట్ ఇస్తే.. దానికి అనుగుణంగా ఇంకో పెద్ద సినిమా గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్ ఖరారు చేసుకునేది. హిందీలో సినిమా ఆరంభానికి ముందే విడుదల తేదీలు ఖరారవుతాయన్న సంగతి తెలిసిందే. ఎవరికీ ఎవరి నుంచీ ఇబ్బంది రాకుండా గ్యాప్ ఇచ్చి విడుదల తేదీలు ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలతో వారికి చావొచ్చి పడింది. వరుసబెట్టి ఇక్కడ పాన్ ఇండియా సినిమాలు తయారవుతున్నాయి.
వాటిని బాలీవుడ్ వాళ్లు పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితి లేదు. సౌత్ సినిమాల ధాటిని బాలీవుడ్ సినిమాలే తట్టుకునే పరిస్థితి లేదిప్పుడు. మన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ను పోయిన దసరాకు రిలీజ్ చేయాలనుకుంటే.. తన ‘మైదాన్’ సినిమాకు ఇబ్బందని బోనీకపూర్ ఎలా ఏడ్చాడో తెలిసిందే. కరోనాతో అల్లాడిపోయిన బాలీవుడ్ నిర్మాతలు.. కొత్త ఏడాదిలో మంచి డిమాండ్ ఉన్న సమ్మర్ డేట్లను ముందే రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా సినిమాలతో చిక్కొచ్చి పడింది. వాటికి ఎదురెళ్లలేక.. సౌత్ సినిమాల డేట్లను అనుసరించి తమ చిత్రాల విడుదల తేదీలు మార్చుకోలేక సతమతం అవుతున్నారు. దక్షిణాది చిత్రాలను చూసి బాలీవుడ్ వాళ్లు ఇంతలా భయపడే పరిస్థితి వస్తుందని కొన్నేళ్ల ముందు ఎవరైనా ఊహించి ఉంటారా?
This post was last modified on January 23, 2022 6:46 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…