మహానటి సినిమాతో వచ్చిన పేరును నిలబెట్టుకునేలా సినిమాలు చేయడంలో కీర్తి సురేష్ విఫలమైన మాట వాస్తవం. ఒక్క సినిమాతో అంత పేరు, ఇమేజ్ రావడం అరుదుగా జరుగుతుంటుంది. ఓవైపు స్టార్ల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా లైన్లో పెట్టింది. అవన్నీ ప్రకటించినపుడు బాగానే అనిపించాయి. కానీ తీరా తెర మీద బొమ్మ పడ్డప్పుడు తేలిపోయాయి.
పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తోడు కీర్తి నటించిన వేరే చిత్రాల్లో కూడా తన పాత్రలు క్లిక్ కాలేదు. వరుసగా ఆమెకు పరాజయాలు తప్పలేదు. ఐతే ఇప్పుడో సినిమా మాత్రం కీర్తి అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తూ అంచనాలను పెంచేలా చేస్తోంది. అదే.. సాని కాయిదం.
ఈ తమిళ చిత్రం ఫస్ట్ లుక్ చూసినపుడే అందరూ స్టన్ అయిపోయారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో.. వీళ్లిద్దరూ కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్లుగా కనిపించనుండటం విశేషం. కీర్తి, సెల్వల లుక్స్ చూస్తే జనాలకు దండుపాళ్యం గుర్తుకొచ్చింది. ఇంత వయొలెంట్ మూవీలో కీర్తి ఎలా ఫిట్ అవుతుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ముందు థియేటర్లలోనే సాని కాయిదం చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. పరిస్థితులు మారిపోవడంతో ఆలోచన మారిపోయింది. దీన్ని ఓటీటీ రిలీజ్కు ఇచ్చేశారు.
కీర్తి పెంగ్విన్ మూవీని రిలీజ్ చేసిన అమేజాన్ ప్రైమే దీన్ని కూడా విడుదల చేయబోతోంది. ఐతే రిలీజ్కు కొంచెం టైం పట్టేలా ఉంది. మంచి రేటుకే సినిమాను కొన్నదట ప్రైమ్. ఈ మధ్యే రిలీజైన రాకీ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తొలి సినిమా రిలీజ్ కాకముందే అతడికి ఈ చిత్రంతో పాటు ధనుష్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం రావడం విశేషం.
This post was last modified on January 22, 2022 10:27 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…