Movie News

విడాకుల ప్రకటన డిలీట్ చేసిన సామ్!

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య-సమంత తమ నాలుగేళ్ల వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 2న వీరు అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చై-సామ్ విడిపోయి మూడు నెలలవుంది. ఇప్పటికీ వారి విడాకుల విషయం హాట్ టాపిక్ గానే ఉంది. అభిమానులు మాత్రం వారు మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్ట్ ను డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే చైతు మాత్రం తన ఇన్స్టాగ్రామ్ లో విడాకుల ప్రకటనను అలానే ఉంచారు. ఒకవేళ కలిసే ఉద్దేశం ఉంటే ఆయన కూడా డిలీట్ చేసేవారు కదా.. కానీ ఇక్కడ ఆలా జరగలేదు.

సమంత సోషల్ మీడియా అకౌంట్ నుంచి మాత్రమే పోస్ట్ డిలీట్ అయింది. సామ్ తన ఇన్స్టాగ్రామ్ ను క్లీన్ చేసే ప్రాసెస్ లో విడాకుల ప్రకటన డిలీట్ అయి ఉంటుందని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా.. చైతు-సమంత తిరిగి కలిస్తే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గానే ‘బంగార్రాజు’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు చైతు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలు.. ఒక వెబ్ సిరీస్ ఉంది. మరోపక్క సమంత ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేయబోతుంది. త్వరలోనే ఈ సినిమాలన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

5 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

11 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

25 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago