టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య-సమంత తమ నాలుగేళ్ల వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 2న వీరు అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చై-సామ్ విడిపోయి మూడు నెలలవుంది. ఇప్పటికీ వారి విడాకుల విషయం హాట్ టాపిక్ గానే ఉంది. అభిమానులు మాత్రం వారు మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్ట్ ను డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే చైతు మాత్రం తన ఇన్స్టాగ్రామ్ లో విడాకుల ప్రకటనను అలానే ఉంచారు. ఒకవేళ కలిసే ఉద్దేశం ఉంటే ఆయన కూడా డిలీట్ చేసేవారు కదా.. కానీ ఇక్కడ ఆలా జరగలేదు.
సమంత సోషల్ మీడియా అకౌంట్ నుంచి మాత్రమే పోస్ట్ డిలీట్ అయింది. సామ్ తన ఇన్స్టాగ్రామ్ ను క్లీన్ చేసే ప్రాసెస్ లో విడాకుల ప్రకటన డిలీట్ అయి ఉంటుందని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా.. చైతు-సమంత తిరిగి కలిస్తే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గానే ‘బంగార్రాజు’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు చైతు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలు.. ఒక వెబ్ సిరీస్ ఉంది. మరోపక్క సమంత ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేయబోతుంది. త్వరలోనే ఈ సినిమాలన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…