టాలీవుడ్ భారీ కాయుల్లో ప్రభాస్ ఒకడు. అంతటి భారీ కాయాన్ని ఫిట్గా మెయింటైన్ చేయడం అంత సులువేమీ కాదు. భోజన ప్రియుడు అయిన ప్రభాస్కు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం మరీ కష్టం. అతను షూటింగ్ లేకుండా కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాడంటే షేప్ ఔట్ అయిపోతుంటాడు. ముఖంలోనూ మార్పులు వచ్చేస్తుంటాయి. ఒళ్లు చేస్తుంటాడు. ఇలా పలు సందర్భాల్లో షూటింగ్ గ్యాప్స్ మధ్య అతను కొంచెం షేప్ ఔట్ అయి కనిపించడం గమనించే ఉంటారు.
చివరగా ‘సాహో’ చిత్రీకరణ ముగిశాక ప్రభాస్ కాస్త అదుపు తప్పాడు. ఆ సినిమా ప్రమోషన్లలో అతడి లుక్ ఏమంత బాగా లేదు. ఐతే తర్వాత కష్టపడి ఒళ్లు తగ్గించుకున్నాడు. రాధాకృష్ణ కుమార్ సినిమా మొదలయ్యే సమయానికి మంచి లుక్లోకి వచ్చాడు. తర్వాత అదే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు.
ఐతే కరోనా-లాక్ డౌన్ మళ్లీ ప్రభాస్ అదుపు తప్పేలా చేసినట్లుంది. లాక్ డౌన్ మొదలయ్యాక ఎక్కడా కనిపించని ప్రభాస్.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొంటూ మీడియా దృష్టిలో పడ్డాడు. మంత్రి సంతోష్తో కలిసి ప్రభాస్ ఈ గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
అతను మళ్లీ షేప్ ఔట్ అయిన సంగతి స్పష్టంతా తెలిసిపోతోంది. బాగా లూజ్గా ఉన్న డ్రెస్ వేసి మేనేజ్ చేద్దామని చూసినా ఫలితం లేకపోయింది. అతను ఫిట్గా లేని సంగతి తెలిసిపోతోంది. లాక్ డౌన్ టైంలో వర్కవుట్లన్నీ ఆపేసి, డైట్ కూడా పక్కన పెట్టేసినట్లున్నాడు ప్రభాస్. అందుకే లుక్లో తేడా వచ్చినట్లుంది. అతడి కొత్త సినిమా షూటింగ్ను కొన్ని వారాల్లో మళ్లీ మొదలుపెడతారంటున్నారు. ఈలోపు ప్రభాస్ గట్టిగా వర్కవుట్ చేస్తే తప్ప సినిమాకు అవసరమైన లుక్లోకి రాలేడు.
This post was last modified on June 12, 2020 3:25 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…