ఇటీవలే టాలీవుడ్లోకి కొత్తగా హీరోగా అడుగు పెట్టాడు యువ కథానాయకుడు ఆశిష్ రెడ్డి. అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కొడుకే ఈ అశిష్. అరంగేట్రానికి ముందు నటనలో, డ్యాన్సులు, ఫైట్లలో బాగానే ట్రైన్ అయినట్లున్నాడేమో.. తొలి సినిమాలో మంచి ఈజ్తో నటించాడు. డ్యాన్సులు, ఫైట్లలో చురుకుదనం చూపించాడు. కాకపోతే సినిమానే అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది.
తొలి సినిమాతో తన వరకు మంచి మార్కులు వేయించుకున్న ఆశిష్.. రెండో చిత్రానికి సుకుమార్ కాంపౌండ్లోకి అడుగు పెడుతున్నాడు. అతడి రెండో సినిమాను నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. తమ బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్కు చెందిన సుకుమార్ రైటింగ్స్ కలిపి ఆశిష్ రెండో చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు రాజు ప్రకటించాడు.
సుకుమార్ శిష్యుడైన కాశి.. ఆశిష్ రెండో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్టులో సుక్కు భాగస్వామ్యం కూడా ఉండబోతోంది. కాశి ఇప్పటికే దర్శకుడిగా తన అరంగేట్ర చిత్రాన్ని పట్టాలెక్కించాడు. చిత్తం మహారాణి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈలోపే ఓ కథ చెప్పి సుకుమార్, రాజులను మెప్పించి ఆశిష్తో సినిమా సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సుకుమార్ను దర్శకుడిగా పరిచయం చేసింది రాజే. వీరి కలయికలో వచ్చిన ఆర్య మూవీతో చాలామంది జీవితాలు మారిపోయాయి.
ఆ తర్వాత ఇప్పటిదాకా సుకుమార్తో రాజు సినిమా తీయలేదు. ఇప్పుడు ఇలా ఇద్దరూ నిర్మాతలుగా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కూడా రాజు, సుకుమార్ కలయికలో ఇంకో సినిమా వచ్చే అవకాశాలున్నాయట. ఇదిలా ఉంటే.. రౌడీ బాయ్స్ సినిమాకు మౌత్ టాక్తో వసూళ్లు పెరుగుతున్నాయని.. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.7 కోట్ల గ్రాస్, 4 కోట్ల షేర్ సాధించిందని, ఒక కొత్త హీరో సినిమాకు ఇవి మంచి వసూళ్లని చెప్పాడు దిల్ రాజు.
This post was last modified on January 20, 2022 8:57 am
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…