ఇటీవలే టాలీవుడ్లోకి కొత్తగా హీరోగా అడుగు పెట్టాడు యువ కథానాయకుడు ఆశిష్ రెడ్డి. అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కొడుకే ఈ అశిష్. అరంగేట్రానికి ముందు నటనలో, డ్యాన్సులు, ఫైట్లలో బాగానే ట్రైన్ అయినట్లున్నాడేమో.. తొలి సినిమాలో మంచి ఈజ్తో నటించాడు. డ్యాన్సులు, ఫైట్లలో చురుకుదనం చూపించాడు. కాకపోతే సినిమానే అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది.
తొలి సినిమాతో తన వరకు మంచి మార్కులు వేయించుకున్న ఆశిష్.. రెండో చిత్రానికి సుకుమార్ కాంపౌండ్లోకి అడుగు పెడుతున్నాడు. అతడి రెండో సినిమాను నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. తమ బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్కు చెందిన సుకుమార్ రైటింగ్స్ కలిపి ఆశిష్ రెండో చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు రాజు ప్రకటించాడు.
సుకుమార్ శిష్యుడైన కాశి.. ఆశిష్ రెండో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్టులో సుక్కు భాగస్వామ్యం కూడా ఉండబోతోంది. కాశి ఇప్పటికే దర్శకుడిగా తన అరంగేట్ర చిత్రాన్ని పట్టాలెక్కించాడు. చిత్తం మహారాణి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈలోపే ఓ కథ చెప్పి సుకుమార్, రాజులను మెప్పించి ఆశిష్తో సినిమా సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సుకుమార్ను దర్శకుడిగా పరిచయం చేసింది రాజే. వీరి కలయికలో వచ్చిన ఆర్య మూవీతో చాలామంది జీవితాలు మారిపోయాయి.
ఆ తర్వాత ఇప్పటిదాకా సుకుమార్తో రాజు సినిమా తీయలేదు. ఇప్పుడు ఇలా ఇద్దరూ నిర్మాతలుగా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కూడా రాజు, సుకుమార్ కలయికలో ఇంకో సినిమా వచ్చే అవకాశాలున్నాయట. ఇదిలా ఉంటే.. రౌడీ బాయ్స్ సినిమాకు మౌత్ టాక్తో వసూళ్లు పెరుగుతున్నాయని.. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.7 కోట్ల గ్రాస్, 4 కోట్ల షేర్ సాధించిందని, ఒక కొత్త హీరో సినిమాకు ఇవి మంచి వసూళ్లని చెప్పాడు దిల్ రాజు.
This post was last modified on January 20, 2022 8:57 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…