టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేతిలో మూడునాలుగు సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా ఈ సంక్రాంతికి రావాల్సింది కానీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం వాయిదా వేశారు. తీరా చూస్తే కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ కూడా వాయిదా పడింది. ఇప్పట్లో ‘భీమ్లానాయక్’ సినిమా కూడా విడుదలయ్యే పరిస్థితి లేదు. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఏకకాలంలో ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు చేయాలనుకుంటున్నారు.
క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఇప్పటికే ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. అలానే హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ లో కూడా పవన్ పాల్గొంటారని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.
అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. ముఖ్యంగా భగత్ సింగ్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్రలో పవన్ కి ధీటుగా సరైన విలన్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు.
దీనికోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయనైతే కథకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతారని హరీష్ శంకర్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. విజయ్ సేతుపతి హీరోగానే కాకుంగా విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాలో ఆయన విలన్ అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే ‘మాస్టర్’ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించారు. ఇప్పుడు పవన్ సినిమాలో విలన్ గా అంటే ఆయన పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి!
This post was last modified on January 19, 2022 8:22 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…