టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేతిలో మూడునాలుగు సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా ఈ సంక్రాంతికి రావాల్సింది కానీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం వాయిదా వేశారు. తీరా చూస్తే కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ కూడా వాయిదా పడింది. ఇప్పట్లో ‘భీమ్లానాయక్’ సినిమా కూడా విడుదలయ్యే పరిస్థితి లేదు. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఏకకాలంలో ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు చేయాలనుకుంటున్నారు.
క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఇప్పటికే ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. అలానే హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ లో కూడా పవన్ పాల్గొంటారని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.
అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. ముఖ్యంగా భగత్ సింగ్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్రలో పవన్ కి ధీటుగా సరైన విలన్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు.
దీనికోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయనైతే కథకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతారని హరీష్ శంకర్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. విజయ్ సేతుపతి హీరోగానే కాకుంగా విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాలో ఆయన విలన్ అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే ‘మాస్టర్’ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించారు. ఇప్పుడు పవన్ సినిమాలో విలన్ గా అంటే ఆయన పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి!
This post was last modified on January 19, 2022 8:22 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…