‘పుష్ప’ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నారే కానీ ఈ రేంజ్ హిట్టునైతే ఎవరూ ఊహించలేదు. చివరికి ఆ మూవీ టీమ్ కూడా. బాలీవుడ్లో అక్కడి సినిమాలను సైతం పక్కకు నెట్టి విజయం సాధించింది పుష్ప. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి మొత్తం సుకుమార్ మీదికి మళ్లింది. పలు భాషల హీరోలు సుకుమార్తో వర్క్ చేయాలని ఆశపడుతున్నట్టు తెలుస్తోంది.
ఓ బాలీవుడ్ హీరో తనతో వర్క్ చేయాలనుకుంటున్నాడని సుకుమార్ రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఇంతలె ఒక తమిళ హీరో కూడా సుకుమార్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే వార్త గుప్పుమంది. ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్. ఇదెంత వరకు నిజమో తెలియదు కానీ.. వెరైటీకి పెద్ద పీట వేసే ధనుష్కి సుకుమార్ ఓ సూపర్బ్ స్టోరీ చెప్పాడని, అతను ఓకే అన్నాడని, త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పుకునేంత వరకు వెళ్లిపోయింది విషయం.
ఆల్రెడీ ధనుష్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ములతో ఓ సినిమాని ప్రకటించాడు. అది సెట్స్కి వెళ్లేలోపే వెంకీ అట్లూరితో ‘సర్’ సినిమాని పట్టాలెక్కించాడు. పుష్ప చూసిన తర్వాత ఇంప్రెస్ అయిపోయి మూడో మూవీని సుకుమార్తో సెట్ చేసుకున్నాడని సమాచారం. ఒకవేళ ఇది నిజమే అయినా ఇప్పుడప్పుడే స్టార్టయ్యే చాన్స్ లేకపోవచ్చు.
ఎందుకంటే చేతినిండా సినిమాలతో ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిని పూర్తి చేయడానికే కరోనా అడ్డుపడుతోంది. ఇక కొత్త సినిమా అంటే ఇప్పట్లో కష్టమే. మరోవైపు సుకుమార్ ముందు ‘పుష్ప 2’ ఉంది. ఇంత సాలిడ్ హిట్ కొట్టాక సెకెండ్ పార్ట్ని మరింత ప్రెస్టీజియస్గా తీయాల్సిన ప్రెజర్ తనమీద ఉంటుంది. అలాంటప్పుడు వేరే సినిమాల గురించి ఆలోచిస్తాడా అనేది డౌట్. అందుకే ఈ వార్త నిజమా కాదా అనే డైలమా ఏర్పడింది. నిజమైతే సూపర్. నిజం కాకపోతే కేవలం రూమర్. అంతే.
This post was last modified on January 18, 2022 8:35 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…