‘పుష్ప’ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నారే కానీ ఈ రేంజ్ హిట్టునైతే ఎవరూ ఊహించలేదు. చివరికి ఆ మూవీ టీమ్ కూడా. బాలీవుడ్లో అక్కడి సినిమాలను సైతం పక్కకు నెట్టి విజయం సాధించింది పుష్ప. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి మొత్తం సుకుమార్ మీదికి మళ్లింది. పలు భాషల హీరోలు సుకుమార్తో వర్క్ చేయాలని ఆశపడుతున్నట్టు తెలుస్తోంది.
ఓ బాలీవుడ్ హీరో తనతో వర్క్ చేయాలనుకుంటున్నాడని సుకుమార్ రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఇంతలె ఒక తమిళ హీరో కూడా సుకుమార్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే వార్త గుప్పుమంది. ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్. ఇదెంత వరకు నిజమో తెలియదు కానీ.. వెరైటీకి పెద్ద పీట వేసే ధనుష్కి సుకుమార్ ఓ సూపర్బ్ స్టోరీ చెప్పాడని, అతను ఓకే అన్నాడని, త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పుకునేంత వరకు వెళ్లిపోయింది విషయం.
ఆల్రెడీ ధనుష్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ములతో ఓ సినిమాని ప్రకటించాడు. అది సెట్స్కి వెళ్లేలోపే వెంకీ అట్లూరితో ‘సర్’ సినిమాని పట్టాలెక్కించాడు. పుష్ప చూసిన తర్వాత ఇంప్రెస్ అయిపోయి మూడో మూవీని సుకుమార్తో సెట్ చేసుకున్నాడని సమాచారం. ఒకవేళ ఇది నిజమే అయినా ఇప్పుడప్పుడే స్టార్టయ్యే చాన్స్ లేకపోవచ్చు.
ఎందుకంటే చేతినిండా సినిమాలతో ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిని పూర్తి చేయడానికే కరోనా అడ్డుపడుతోంది. ఇక కొత్త సినిమా అంటే ఇప్పట్లో కష్టమే. మరోవైపు సుకుమార్ ముందు ‘పుష్ప 2’ ఉంది. ఇంత సాలిడ్ హిట్ కొట్టాక సెకెండ్ పార్ట్ని మరింత ప్రెస్టీజియస్గా తీయాల్సిన ప్రెజర్ తనమీద ఉంటుంది. అలాంటప్పుడు వేరే సినిమాల గురించి ఆలోచిస్తాడా అనేది డౌట్. అందుకే ఈ వార్త నిజమా కాదా అనే డైలమా ఏర్పడింది. నిజమైతే సూపర్. నిజం కాకపోతే కేవలం రూమర్. అంతే.
This post was last modified on January 18, 2022 8:35 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…