‘పుష్ప’ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నారే కానీ ఈ రేంజ్ హిట్టునైతే ఎవరూ ఊహించలేదు. చివరికి ఆ మూవీ టీమ్ కూడా. బాలీవుడ్లో అక్కడి సినిమాలను సైతం పక్కకు నెట్టి విజయం సాధించింది పుష్ప. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి మొత్తం సుకుమార్ మీదికి మళ్లింది. పలు భాషల హీరోలు సుకుమార్తో వర్క్ చేయాలని ఆశపడుతున్నట్టు తెలుస్తోంది.
ఓ బాలీవుడ్ హీరో తనతో వర్క్ చేయాలనుకుంటున్నాడని సుకుమార్ రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఇంతలె ఒక తమిళ హీరో కూడా సుకుమార్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే వార్త గుప్పుమంది. ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్. ఇదెంత వరకు నిజమో తెలియదు కానీ.. వెరైటీకి పెద్ద పీట వేసే ధనుష్కి సుకుమార్ ఓ సూపర్బ్ స్టోరీ చెప్పాడని, అతను ఓకే అన్నాడని, త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పుకునేంత వరకు వెళ్లిపోయింది విషయం.
ఆల్రెడీ ధనుష్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ములతో ఓ సినిమాని ప్రకటించాడు. అది సెట్స్కి వెళ్లేలోపే వెంకీ అట్లూరితో ‘సర్’ సినిమాని పట్టాలెక్కించాడు. పుష్ప చూసిన తర్వాత ఇంప్రెస్ అయిపోయి మూడో మూవీని సుకుమార్తో సెట్ చేసుకున్నాడని సమాచారం. ఒకవేళ ఇది నిజమే అయినా ఇప్పుడప్పుడే స్టార్టయ్యే చాన్స్ లేకపోవచ్చు.
ఎందుకంటే చేతినిండా సినిమాలతో ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిని పూర్తి చేయడానికే కరోనా అడ్డుపడుతోంది. ఇక కొత్త సినిమా అంటే ఇప్పట్లో కష్టమే. మరోవైపు సుకుమార్ ముందు ‘పుష్ప 2’ ఉంది. ఇంత సాలిడ్ హిట్ కొట్టాక సెకెండ్ పార్ట్ని మరింత ప్రెస్టీజియస్గా తీయాల్సిన ప్రెజర్ తనమీద ఉంటుంది. అలాంటప్పుడు వేరే సినిమాల గురించి ఆలోచిస్తాడా అనేది డౌట్. అందుకే ఈ వార్త నిజమా కాదా అనే డైలమా ఏర్పడింది. నిజమైతే సూపర్. నిజం కాకపోతే కేవలం రూమర్. అంతే.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…