Movie News

నన్ను అలా పిలవద్దు.. అనసూయ వార్నింగ్!

బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ఇప్పుడు సినిమాలతో మరింత బిజీ అయింది. ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలు నటిగా ఆమె పాపులారిటీని పెంచాయి. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది ఈ బ్యూటీ. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో తన రోల్ కి మరింత ప్రాముఖ్యత ఉంటుందని చెబుతుంది అనసూయ. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంటుంది.

తన డ్రెస్సింగ్, ఆమె చేసే కొన్ని కామెంట్స్ వలన నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తుంటారు. ట్రోలర్స్ అంతే ధీటుగా బదులిస్తుంటుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి..?’ అని ప్రశ్నించగా.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు  అంత బాగా తెలియదు. నువ్ అడిగింది ఏజ్ షేమింగ్ కిందకి వస్తుంది. దీన్ని బట్టి నీ పెంపకం మీద అనుమానం వస్తుంది’ అని సమాధానమిచ్చింది. 

అనసూయ ఇచ్చిన సమాధానం చాలా మందికి నచ్చలేదు. దీంతో ఓ నెటిజన్ ‘ఒకరిని అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కాదు.. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దు’ అని కామెంట్ చేయగా.. అది చూసిన అనసూయ.. ‘బహుశా ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు కానీ మీరు నా ఉద్దేశాన్ని గమనించండి. నేనేం చెప్పానో మీకు తెలుసు. ఇక కాంప్లిమెంట్స్ తీసుకోవాలా..? వద్దా..? అనేది ఒకరి ఇష్టం కదా..!ఒక నావ సముద్రం మీద ఈదగలదు. అదే నావ, సముద్రాన్ని తన లోపలికి రానిస్తే… మునిగిపోతుంది. అందువల్ల… జన సముద్రం నుంచి ఏది ఎంత కావాలో/ తీసుకోవాలో నాకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది. 

అలానే నెగెటివ్ ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఒకప్పుతు తనపై, తన ఫ్యామిలీపై నెగెటివ్ ట్రోల్స్ ఎఫెక్ట్ చూపించేవని కానీ ఇప్పుడు తామంతా స్ట్రాంగ్ అయ్యామని చెప్పింది. ఎవరైనా ఎవరినైనా హర్ట్ చేస్తే.. చివరకు వాళ్లే బాధ పడతారని.. కర్మ అనేది ఒకటి ఉంటుందని అభిమానులతో చెప్పుకొచ్చింది అనసూయ. 

This post was last modified on January 17, 2022 3:37 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

1 hour ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

2 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

3 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

3 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

4 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

6 hours ago