బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ఇప్పుడు సినిమాలతో మరింత బిజీ అయింది. ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలు నటిగా ఆమె పాపులారిటీని పెంచాయి. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది ఈ బ్యూటీ. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో తన రోల్ కి మరింత ప్రాముఖ్యత ఉంటుందని చెబుతుంది అనసూయ. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంటుంది.
తన డ్రెస్సింగ్, ఆమె చేసే కొన్ని కామెంట్స్ వలన నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తుంటారు. ట్రోలర్స్ అంతే ధీటుగా బదులిస్తుంటుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి..?’ అని ప్రశ్నించగా.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు అంత బాగా తెలియదు. నువ్ అడిగింది ఏజ్ షేమింగ్ కిందకి వస్తుంది. దీన్ని బట్టి నీ పెంపకం మీద అనుమానం వస్తుంది’ అని సమాధానమిచ్చింది.
అనసూయ ఇచ్చిన సమాధానం చాలా మందికి నచ్చలేదు. దీంతో ఓ నెటిజన్ ‘ఒకరిని అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కాదు.. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దు’ అని కామెంట్ చేయగా.. అది చూసిన అనసూయ.. ‘బహుశా ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు కానీ మీరు నా ఉద్దేశాన్ని గమనించండి. నేనేం చెప్పానో మీకు తెలుసు. ఇక కాంప్లిమెంట్స్ తీసుకోవాలా..? వద్దా..? అనేది ఒకరి ఇష్టం కదా..!ఒక నావ సముద్రం మీద ఈదగలదు. అదే నావ, సముద్రాన్ని తన లోపలికి రానిస్తే… మునిగిపోతుంది. అందువల్ల… జన సముద్రం నుంచి ఏది ఎంత కావాలో/ తీసుకోవాలో నాకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది.
అలానే నెగెటివ్ ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఒకప్పుతు తనపై, తన ఫ్యామిలీపై నెగెటివ్ ట్రోల్స్ ఎఫెక్ట్ చూపించేవని కానీ ఇప్పుడు తామంతా స్ట్రాంగ్ అయ్యామని చెప్పింది. ఎవరైనా ఎవరినైనా హర్ట్ చేస్తే.. చివరకు వాళ్లే బాధ పడతారని.. కర్మ అనేది ఒకటి ఉంటుందని అభిమానులతో చెప్పుకొచ్చింది అనసూయ.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…