బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ఇప్పుడు సినిమాలతో మరింత బిజీ అయింది. ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలు నటిగా ఆమె పాపులారిటీని పెంచాయి. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది ఈ బ్యూటీ. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో తన రోల్ కి మరింత ప్రాముఖ్యత ఉంటుందని చెబుతుంది అనసూయ. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంటుంది.
తన డ్రెస్సింగ్, ఆమె చేసే కొన్ని కామెంట్స్ వలన నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తుంటారు. ట్రోలర్స్ అంతే ధీటుగా బదులిస్తుంటుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి..?’ అని ప్రశ్నించగా.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు అంత బాగా తెలియదు. నువ్ అడిగింది ఏజ్ షేమింగ్ కిందకి వస్తుంది. దీన్ని బట్టి నీ పెంపకం మీద అనుమానం వస్తుంది’ అని సమాధానమిచ్చింది.
అనసూయ ఇచ్చిన సమాధానం చాలా మందికి నచ్చలేదు. దీంతో ఓ నెటిజన్ ‘ఒకరిని అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కాదు.. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దు’ అని కామెంట్ చేయగా.. అది చూసిన అనసూయ.. ‘బహుశా ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు కానీ మీరు నా ఉద్దేశాన్ని గమనించండి. నేనేం చెప్పానో మీకు తెలుసు. ఇక కాంప్లిమెంట్స్ తీసుకోవాలా..? వద్దా..? అనేది ఒకరి ఇష్టం కదా..!ఒక నావ సముద్రం మీద ఈదగలదు. అదే నావ, సముద్రాన్ని తన లోపలికి రానిస్తే… మునిగిపోతుంది. అందువల్ల… జన సముద్రం నుంచి ఏది ఎంత కావాలో/ తీసుకోవాలో నాకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది.
అలానే నెగెటివ్ ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఒకప్పుతు తనపై, తన ఫ్యామిలీపై నెగెటివ్ ట్రోల్స్ ఎఫెక్ట్ చూపించేవని కానీ ఇప్పుడు తామంతా స్ట్రాంగ్ అయ్యామని చెప్పింది. ఎవరైనా ఎవరినైనా హర్ట్ చేస్తే.. చివరకు వాళ్లే బాధ పడతారని.. కర్మ అనేది ఒకటి ఉంటుందని అభిమానులతో చెప్పుకొచ్చింది అనసూయ.
This post was last modified on January 17, 2022 3:37 pm
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుది పాలనలో ఎప్పుడూ ప్రత్యేక శైలే. అందరికీ ఆదర్శప్రాయమైన నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు…ప్రజా ధనం దుబారా…
రాజకీయ సన్యాసం అంటూ తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… రోజుకో రీతిన వ్యవహరిస్తూ…
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన గాయకుల్లో ఒకడిగా ఉదిత్ నారాయణ పేరు చెప్పొచ్చు. ఆయన దక్షిణాది సంగీత…
ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఒకటేమో ఏకంగా 400 కోట్ల బడ్జెట్…
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…