సింగర్ చిన్మయి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో ఉంటున్న ఫైర్ బ్రాండ్. తాజాగా చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ‘సమాజం రేపిస్ట్లను ప్రేమిస్తుంది’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికొస్తే.. ‘2017లో కేరళలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పలువురు సినీ సెలబ్రిటీలు గొంతెత్తారు. నటి భావన మీనన్ కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్పై బయటికొచ్చాడు’.
అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్, ఐశ్వర్యా లక్ష్మీ ఉన్నారు. మహిళా సంఘాలతో కలిసి బాధిత హీరోయిన్కు ఆమె సపోర్ట్గా పోరాటం చేశారు. అయితే ఆ పోరాటం మధ్యలోనే ఆగిపోయింది. బాధిత హీరోయిన్కు సపోర్ట్గా నిలిచిన కారణం తను చాలా అవకాశాలు కోల్పోయానని నటి పార్వతి తెలిపారు. చేతిలో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ అవకాశాలు రానివ్వకుండా చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్వతి అన్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటమే నేరమైందని పార్వతి వాపోయారు.
ఈ నేపథ్యంలో పార్వతి ఆవేదనపై సింగర్ చిన్నయి ట్వీట్ చేశారు. జరిగిన అన్యాయాన్ని నిలదీసి నిజం మాట్లాడినందుకు పార్వతిలాంటి ప్రతిభ ఉన్న నటి అవకాశాల కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపులు నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్లనే తన అవకాశాలు కోల్పోయింది అన్నది వాస్తవం. ఇదే సమస్యపై చాలామంది మౌనం వహించారు. సాటి మహిళ కోసం గొంతెత్తిన వారు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ‘సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’ అని చిన్మయి ట్వీట్ చేశారు. నటి భావన కూడా ఐదేళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపుతుండడం గమనార్హం.
This post was last modified on January 16, 2022 10:28 pm
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో నారా భువనేశ్వరి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మ్యూజికల్…
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇది…
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా…