సింగర్ చిన్మయి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో ఉంటున్న ఫైర్ బ్రాండ్. తాజాగా చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ‘సమాజం రేపిస్ట్లను ప్రేమిస్తుంది’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికొస్తే.. ‘2017లో కేరళలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పలువురు సినీ సెలబ్రిటీలు గొంతెత్తారు. నటి భావన మీనన్ కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్పై బయటికొచ్చాడు’.
అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్, ఐశ్వర్యా లక్ష్మీ ఉన్నారు. మహిళా సంఘాలతో కలిసి బాధిత హీరోయిన్కు ఆమె సపోర్ట్గా పోరాటం చేశారు. అయితే ఆ పోరాటం మధ్యలోనే ఆగిపోయింది. బాధిత హీరోయిన్కు సపోర్ట్గా నిలిచిన కారణం తను చాలా అవకాశాలు కోల్పోయానని నటి పార్వతి తెలిపారు. చేతిలో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ అవకాశాలు రానివ్వకుండా చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్వతి అన్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటమే నేరమైందని పార్వతి వాపోయారు.
ఈ నేపథ్యంలో పార్వతి ఆవేదనపై సింగర్ చిన్నయి ట్వీట్ చేశారు. జరిగిన అన్యాయాన్ని నిలదీసి నిజం మాట్లాడినందుకు పార్వతిలాంటి ప్రతిభ ఉన్న నటి అవకాశాల కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపులు నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్లనే తన అవకాశాలు కోల్పోయింది అన్నది వాస్తవం. ఇదే సమస్యపై చాలామంది మౌనం వహించారు. సాటి మహిళ కోసం గొంతెత్తిన వారు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ‘సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’ అని చిన్మయి ట్వీట్ చేశారు. నటి భావన కూడా ఐదేళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపుతుండడం గమనార్హం.
This post was last modified on January 16, 2022 10:28 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…