సింగర్ చిన్మయి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో ఉంటున్న ఫైర్ బ్రాండ్. తాజాగా చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ‘సమాజం రేపిస్ట్లను ప్రేమిస్తుంది’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికొస్తే.. ‘2017లో కేరళలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పలువురు సినీ సెలబ్రిటీలు గొంతెత్తారు. నటి భావన మీనన్ కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్పై బయటికొచ్చాడు’.
అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్, ఐశ్వర్యా లక్ష్మీ ఉన్నారు. మహిళా సంఘాలతో కలిసి బాధిత హీరోయిన్కు ఆమె సపోర్ట్గా పోరాటం చేశారు. అయితే ఆ పోరాటం మధ్యలోనే ఆగిపోయింది. బాధిత హీరోయిన్కు సపోర్ట్గా నిలిచిన కారణం తను చాలా అవకాశాలు కోల్పోయానని నటి పార్వతి తెలిపారు. చేతిలో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ అవకాశాలు రానివ్వకుండా చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్వతి అన్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటమే నేరమైందని పార్వతి వాపోయారు.
ఈ నేపథ్యంలో పార్వతి ఆవేదనపై సింగర్ చిన్నయి ట్వీట్ చేశారు. జరిగిన అన్యాయాన్ని నిలదీసి నిజం మాట్లాడినందుకు పార్వతిలాంటి ప్రతిభ ఉన్న నటి అవకాశాల కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపులు నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్లనే తన అవకాశాలు కోల్పోయింది అన్నది వాస్తవం. ఇదే సమస్యపై చాలామంది మౌనం వహించారు. సాటి మహిళ కోసం గొంతెత్తిన వారు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ‘సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’ అని చిన్మయి ట్వీట్ చేశారు. నటి భావన కూడా ఐదేళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపుతుండడం గమనార్హం.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…