టాలీవుడ్ స్టార్ హీరోలు ఇంతకుముందులా మూస సినిమాలకు పరిమితం కావట్లేదు. అలాంటి సినిమాలతో రిస్క్ ఎక్కువైపోయింది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. స్టార్ హీరోలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే బాగా ఆదరిస్తున్నారు. దీంతో ఎంత మాస్ హీరోలైనా సరే.. ఎంతో కొంత కొత్తదనం కోసం చూస్తున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు.
ఐతే మాస్ రాజా రవితేజకు మాత్రం ప్రయోగాలంటే చాలా భయం. అతను డిఫరెంటుగా ఏదైనా సినిమా చేశాడంటే చాలు.. గట్టి ఎదురు దెబ్బ తగులుతుంటుంది. నా ఆటోగ్రాఫ్, సారొస్తారు, డిస్కో రాజా.. ఇలా ఈ జాబితాలో చాలా సినిమాలే కనిపిస్తున్నాయి. ఒక నాలుగైదు మాస్ మసాలా సినిమాలు చేసి.. బ్రేక్ తీసుకుని ఒక డిఫరెంట్ మూవీ ట్రై చేస్తుంటాడు రవితేజ. కానీ అతడి ప్రయత్నానికి సరైన ఫలితమే దక్కట్లేదు.‘డిస్కో రాజా’తో షాక్ తిన్న తర్వాత ‘క్రాక్’ లాంటి మాస్ మసాలా సినిమా చేస్తే అది బ్లాక్బస్టర్ అయింది.
ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఐతే ఇప్పుడు అతను మళ్లీ ఓ ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఆ చిత్రమే..రావణాసుర. ఇందులో రవితేజ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. అతడి పాత్ర.. లుక్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయట. ప్రేక్షకులు ఆ పాత్ర చూసి షాకవుతారని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ చిత్రానికి స్క్రిప్టు అందించింది సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ విస్సా కావడం విశేషం. ఇటీవల ‘పుష్ప’ మూవీతో మాటల రచయితగా అతడికి మంచి పేరొచ్చింది. సక్సెస్ మీట్లో ఈ యంగ్ రైటర్ గురించి సుక్కు చాలా గొప్పగా చెప్పాడు. గురువు బాటలో కొత్త కథలు రాస్తున్న శ్రీకాంత్.. రవితేజ కోసం ఓ ప్రయోగాత్మక స్క్రిప్టు రెడీ చేశాడు. దాన్ని సుధీర్ వర్మ చేతుల్లో పెట్టాడు. మరి రవితేజ చేస్తున్న ఈ రిస్క్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on January 15, 2022 3:11 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…