మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు.
ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తన బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను వెల్లడించారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
అంటే.. ఏడాది ముందుగానే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకున్నారన్నమాట. పాన్ ఇండియా సినిమా కాబట్టి పక్కా ప్లానింగ్ ప్రకారం అంతా చేస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ ని ముందే అనౌన్స్ చేసేశారు. పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడింది. మరి వచ్చే ఏడాదికి ప్లాన్ చేసిన శంకర్ సినిమా అయినా చెప్పిన టైంకి వస్తుందో లేదో చూడాలి
This post was last modified on January 13, 2022 6:41 pm
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…
సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు.…
కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా…
అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం.…
సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…