మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు.
ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తన బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను వెల్లడించారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
అంటే.. ఏడాది ముందుగానే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకున్నారన్నమాట. పాన్ ఇండియా సినిమా కాబట్టి పక్కా ప్లానింగ్ ప్రకారం అంతా చేస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ ని ముందే అనౌన్స్ చేసేశారు. పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడింది. మరి వచ్చే ఏడాదికి ప్లాన్ చేసిన శంకర్ సినిమా అయినా చెప్పిన టైంకి వస్తుందో లేదో చూడాలి
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…