మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు.
ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తన బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను వెల్లడించారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
అంటే.. ఏడాది ముందుగానే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకున్నారన్నమాట. పాన్ ఇండియా సినిమా కాబట్టి పక్కా ప్లానింగ్ ప్రకారం అంతా చేస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ ని ముందే అనౌన్స్ చేసేశారు. పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడింది. మరి వచ్చే ఏడాదికి ప్లాన్ చేసిన శంకర్ సినిమా అయినా చెప్పిన టైంకి వస్తుందో లేదో చూడాలి
This post was last modified on January 13, 2022 6:41 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…