ఓ కొత్త హీరోని జనాలకు దగ్గర చేయడం అంత ఈజీ కాదు. అతను స్క్రీన్ మీద ఎలా ఉంటాడో తెలీదు. ఎలా యాక్ట్ చేస్తాడో ఐడియా ఉండదు. అయినా ఆడియెన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే ఒక్కటే మార్గం. మంచి ప్రమోషన్. అదిరిపోయే పబ్లిసిటీ. అందుకే తన తమ్ముడి కొడుకైన ఆశిష్ని ప్రమోట్ చేయడంలో ఏమాత్రం రాజీ పడటం లేదు దిల్ రాజు.
‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి డైరెక్షన్లో ఆశిష్ హీరోగా ‘రౌడీ బోయ్స్’ సినిమాని నిర్మించారాయన. ఈ సినిమా జనవరి 14న విడుదలవుతూ ఉండటంతో ప్రమోషన్స్ని ఓ రేంజ్లో ప్లాన్ చేశారు. ఓ వైపు ప్రెస్మీట్స్ జరుగుతున్నాయి. టీమ్ మెంబర్స్ ఒక్కొకరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ అప్డేట్స్ వదులుతున్నారు.
ఇంకోవైపు స్టార్ హీరోలందరినీ ప్రమోషన్కి వాడేస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ని ఎన్టీఆర్తో రిలీజ్ చేయించారు. ఒక పాటను మొన్న ఈవెంట్ పెట్టి మరీ అల్లు అర్జున్ చేత విడుదల చేయించారు. మరో పాటను ప్రభాస్ విడుదల చేశాడు. ఇప్పుడు మ్యూజికల్ ఈవెంట్ పెట్టి రామ్చరణ్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు.
దిల్ రాజుకి ఉన్న ఇమేజ్ కారణంగా ఇలా స్టార్ హీరోలంతా ఆశిష్ని ప్రమోట్ చేయడానికి ఒక్కో చెయ్యి వేస్తున్నారు. చాలాకాలం తర్వాత వస్తున్న ప్యూర్ కాలేజ్ స్టోరీ కనుక అందరినీ నచ్చుతుందనే నమ్మకంతో కూడా టీమ్ ఉన్నారు. మరి వీరి నమ్మకం, వారి హస్తవాసి కలిసి ఆశిష్కి, అతడి మొదటి సినిమాకి విజయాన్ని కట్టబెడతాయో లేదో చూడాలి.
This post was last modified on January 13, 2022 8:14 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…