తమిళంలో ఎప్పుడో ఏడేళ్ల కిందట విడుదలైన సినిమా మద్రాస్. కార్తి కథానాయకుడిగా పా.రంజిత్ రూపొందించిన సినిమా ఇది. కబాలి కంటే ముందు రంజిత్ ఈ సినిమా తీశాడు. అతడికి దర్శకుడిగా ఇది రెండో సినిమా. రంజిత్ కెరీర్లోనే దీన్ని బెస్ట్ ఫిలింగా చెప్పొచ్చు. కార్తి కెరీర్లో కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రమే.
ఐతే అంత పాత సినిమాను ఇప్పుడు తెలుగులో ఓ కొత్త చిత్రంలా కలరింగ్ ఇస్తూ రిలీజ్ చేయాలని చూశాడు ఓ నిర్మాత. సంక్రాంతికి పెద్ద సినిమాలు రేసు నుంచి తప్పుకోవడంతో ఉన్నట్లుండి ఈ పాత సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. పైగా ఈ చిత్రానికి నా పేరు శివ-2 అని టైటిల్ పెట్టి గతంలో వచ్చిన కార్తి హిట్ మూవీ నా పేరు శివకు సీక్వెల్ లాగా భ్రమింపజేయడానికి కూడా చూశారు. ఐతే సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా?
ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని వరల్డ్ సినిమా మొత్తం మీదా తిరుగులేని పట్టు సాధించిన నెటిజన్లకు తమిళ సినిమాల గురించి తెలియదా? సోషల్ మీడియా లేని రోజుల్లో అయితే ఇలాంటి గిమ్మిక్కులు పని చేసేవి కానీ.. అప్పుడు వర్కవుట్ కావసలు. నా పేరు శివ-2 పాత సినిమా అనే విషయం బయటపెట్టి తెలుగు ప్రేక్షకులంటే ఇంత చులకనా.. మమ్మల్ని ఫూల్స్ను చేద్దామనుకుంటున్నారా అని ఏకి పడేశారు ఈ చిత్ర బృందాన్ని.
నిజానికి ఈ సినిమాను కార్తి తెలుగులో ప్రమోట్ చేద్దామని కూడా అనుకున్నట్లుగా వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో కానీ.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్లతో కొంత హడావుడి చేశాక సోషల్ మీడియాలో ఎదురైన తీవ్ర విమర్శలు చూశాక జడిసి వెనక్కి తగ్గింది చిత్ర బృందం. ప్రస్తుతానికి సంక్రాంతి నుంచి ఈ సినిమా వాయిదా పడ్డట్లు ప్రకటన చేశారు. బహుశా ఆ తర్వాత కూడా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు లేనట్లే. రిలీజైనా మన ప్రేక్షకులను దీన్ని పట్టించుకోకపోవచ్చు.
This post was last modified on January 12, 2022 10:25 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…