కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లలో మాత్రం ఆయన వరుస ఫ్లాప్ లు చవిచూశారు. దీంతో రూటు మార్చి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ‘మహర్షి’ సినిమాలో అల్లరోడి యాక్టింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే తరహా సీరియస్ సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘నాంది’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి. నిర్మాతలకు కూడా మంచి లాభాలను తీసుకొచ్చింది. ఈ హిట్టు సినిమా తరువాత ‘సభకు నమస్కారం’ అనే మరో సినిమా అంగీకరించారు అల్లరి నరేష్. మల్లంపాటి సతీష్ దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మించాల్సి వుంది. కానీ నిర్మాత హఠాన్మరణం కారణంగా ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. మరో ప్రొడ్యూసర్ తో ఈ సినిమా ముందుకెళ్తుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. అల్లరి నరేష్ తాజాగా ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించారట. అతడొక తమిళ దర్శకుడని తెలుస్తోంది. రాజా మోహన్ అనే కొత్త దర్శకుడు ఇటీవల నరేష్ ని కలిసి కథ వినిపించారట. స్టోరీ డిఫరెంట్ గా ఉండడంతో నరేష్ కూడా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ రచయిత అబ్బూరి రవి.. ఈ ప్రాజెక్ట్ ను అల్లరి నరేష్ దగ్గరకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇంకా నిర్మాత ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు. కానీ ప్రాజెక్ట్ మాత్రం పక్కా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఒకవేళ ‘సభకు నమస్కారం’ సినిమా ఆలస్యమైతే గనుక ముందుగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 9, 2022 11:30 am
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…