కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లలో మాత్రం ఆయన వరుస ఫ్లాప్ లు చవిచూశారు. దీంతో రూటు మార్చి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ‘మహర్షి’ సినిమాలో అల్లరోడి యాక్టింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే తరహా సీరియస్ సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘నాంది’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి. నిర్మాతలకు కూడా మంచి లాభాలను తీసుకొచ్చింది. ఈ హిట్టు సినిమా తరువాత ‘సభకు నమస్కారం’ అనే మరో సినిమా అంగీకరించారు అల్లరి నరేష్. మల్లంపాటి సతీష్ దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మించాల్సి వుంది. కానీ నిర్మాత హఠాన్మరణం కారణంగా ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. మరో ప్రొడ్యూసర్ తో ఈ సినిమా ముందుకెళ్తుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. అల్లరి నరేష్ తాజాగా ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించారట. అతడొక తమిళ దర్శకుడని తెలుస్తోంది. రాజా మోహన్ అనే కొత్త దర్శకుడు ఇటీవల నరేష్ ని కలిసి కథ వినిపించారట. స్టోరీ డిఫరెంట్ గా ఉండడంతో నరేష్ కూడా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ రచయిత అబ్బూరి రవి.. ఈ ప్రాజెక్ట్ ను అల్లరి నరేష్ దగ్గరకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇంకా నిర్మాత ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు. కానీ ప్రాజెక్ట్ మాత్రం పక్కా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఒకవేళ ‘సభకు నమస్కారం’ సినిమా ఆలస్యమైతే గనుక ముందుగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 9, 2022 11:30 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…