తెలుగు సినిమాకు సంబంధించిన ఒక మల్టీ టాలెంట్ ఉన్న ప్రముఖులు చాలా కొద్ది మందే ఉంటారు. అందులో ఒకరు తనికెళ్ల భరణి. నటుడిగా మాత్రమే కాదు.. రచయితగా.. కవిగా సుపరిచితుడు. తెలుగు సినిమాకు సంబంధించి.. ఏ పాత్రకైనా సరే పరకాయి ప్రవేశం చేసేయటం తనికెళ్ల భరణికి మాత్రమే చెల్లు అని చెప్పాలి. తన విలక్షణమైన తీరుతో ఎంతో మందిని తన అభిమానులుగా చేసుకున్న ఆయన.. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన నోటి నుంచి పలు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.
ఊహ గుర్తుంది కదా? ప్రస్తుతం సీనియర్ కథానాయకుడిగా సుపరిచితమైన శ్రీకాంత్ సతీమణిగా ఉన్న సినీ నటి ‘ఉహ’ గుర్తుందా? ఆమె నటించిన మూవీలో తనికెళ్ల విలనిజాన్ని ప్రదర్శిస్తారు. ఈ మూవీలో మరదలపై కన్నేసిన బావగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయనకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయట. కొందరైతే ఫోన్లు చేసి చంపేస్తామని మహిళామణులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను కేవలం నటించానని.. దాన్ని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పినట్లు వెల్లడించారు.
అది కేవలం స్క్రీన్ మీదనే తప్పించి మరింకేమీ కాదని తాను సర్ది చెప్పినా.. వారు ఊరుకునే వారు కాదన్నారు. తెలుగు వారికి నటన అన్నా.. సినిమాలు అన్నా ఎంత క్రేజ్ అన్నది తెలిసిన అంశమని చెప్పారు తనికెళ్ల భరణి. నటుడిగా, రచయితగా తెలుగువారందరికీ సుపరిచితమే. తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన నిజ జీవితంలోబెదిరింపులను సైతం ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ విషయాలను వెల్లడించాడు.
ఊహ సినిమాలో కీలక పాత్ర పోషించిన తనికెళ్ల భరణి.. ఆ సినిమాలో కాస్త విలనిజం కనబరుస్తాడు. భర్త చనిపోయిన మరదలిపై కన్నేసిన ఊహ బావ పాత్రలో తనికెళ్ల నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో అదే స్థాయిలో బెదిరింపులు కూడా వచ్చాయట. ఆ సినిమా అనంతరం కొందరు మహిళలు తనను చంపేస్తామంటూ బెదిరించారు. అది నిజం కాదు.. కేవలం నటన మాత్రమే అని చెప్పినా కొందరు వినిపించుకునేవాళ్లు కాదు. నటన అంటే ప్రేక్షకులు అంతలా మమేకమైపోతారు అంటూ చెప్పుకొచ్చారు. తనికెళ్ల చెప్పిన మాటల్లో నిజం ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on January 9, 2022 10:27 am
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…