తెలుగు సినిమాకు సంబంధించిన ఒక మల్టీ టాలెంట్ ఉన్న ప్రముఖులు చాలా కొద్ది మందే ఉంటారు. అందులో ఒకరు తనికెళ్ల భరణి. నటుడిగా మాత్రమే కాదు.. రచయితగా.. కవిగా సుపరిచితుడు. తెలుగు సినిమాకు సంబంధించి.. ఏ పాత్రకైనా సరే పరకాయి ప్రవేశం చేసేయటం తనికెళ్ల భరణికి మాత్రమే చెల్లు అని చెప్పాలి. తన విలక్షణమైన తీరుతో ఎంతో మందిని తన అభిమానులుగా చేసుకున్న ఆయన.. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన నోటి నుంచి పలు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.
ఊహ గుర్తుంది కదా? ప్రస్తుతం సీనియర్ కథానాయకుడిగా సుపరిచితమైన శ్రీకాంత్ సతీమణిగా ఉన్న సినీ నటి ‘ఉహ’ గుర్తుందా? ఆమె నటించిన మూవీలో తనికెళ్ల విలనిజాన్ని ప్రదర్శిస్తారు. ఈ మూవీలో మరదలపై కన్నేసిన బావగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయనకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయట. కొందరైతే ఫోన్లు చేసి చంపేస్తామని మహిళామణులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను కేవలం నటించానని.. దాన్ని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పినట్లు వెల్లడించారు.
అది కేవలం స్క్రీన్ మీదనే తప్పించి మరింకేమీ కాదని తాను సర్ది చెప్పినా.. వారు ఊరుకునే వారు కాదన్నారు. తెలుగు వారికి నటన అన్నా.. సినిమాలు అన్నా ఎంత క్రేజ్ అన్నది తెలిసిన అంశమని చెప్పారు తనికెళ్ల భరణి. నటుడిగా, రచయితగా తెలుగువారందరికీ సుపరిచితమే. తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన నిజ జీవితంలోబెదిరింపులను సైతం ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ విషయాలను వెల్లడించాడు.
ఊహ సినిమాలో కీలక పాత్ర పోషించిన తనికెళ్ల భరణి.. ఆ సినిమాలో కాస్త విలనిజం కనబరుస్తాడు. భర్త చనిపోయిన మరదలిపై కన్నేసిన ఊహ బావ పాత్రలో తనికెళ్ల నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో అదే స్థాయిలో బెదిరింపులు కూడా వచ్చాయట. ఆ సినిమా అనంతరం కొందరు మహిళలు తనను చంపేస్తామంటూ బెదిరించారు. అది నిజం కాదు.. కేవలం నటన మాత్రమే అని చెప్పినా కొందరు వినిపించుకునేవాళ్లు కాదు. నటన అంటే ప్రేక్షకులు అంతలా మమేకమైపోతారు అంటూ చెప్పుకొచ్చారు. తనికెళ్ల చెప్పిన మాటల్లో నిజం ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on January 9, 2022 10:27 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…