బిగ్ బాస్ షో బుల్లితెరపై ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. విదేశాలకు చెందిన ఈ షో ఇప్పుడు ఇండియాలో కూడా బాగా ఫేమస్ అయింది. ముందుగా నార్త్ లో మొదలుపెట్టిన ఈ షోని మెల్లగా సౌత్ కి కూడా తీసుకొచ్చారు. తెలుగులో ఇప్పటికీ ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. రీసెంట్ గానే సీజన్ 5 ఫినాలే జరిగింది. ఈ సీజన్ విజేతగా సన్నీ నిలిచారు. ఇదిలా ఉండగా.. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలుకాబోతుంది.
అయితే ఈసారి ప్రత్యేకంగా ఓటీటీ కోసం ఈ షోని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘వూట్’లో బిగ్ బాస్ షోని టెలికాస్ట్ చేశారు. కానీ ఓటీటీ వెర్షన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే తెలుగులో డిఫరెంట్ గా ప్లాన్ చేసి.. ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ఈ షో కేవలం పది వారాలు మాత్రమే ఉంటుందట. సాధారణంగా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వంద రోజులకు పైగానే ఉంటుంది.
కానీ ఓటీటీ బిగ్ బాస్ మాత్రం కేవలం పది వారాలే ఉంటుందని సమాచారం. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ఈ షోకి నాగార్జున హోస్ట్ గా కనిపించనున్నారు. ఇప్పటికే దాదాపు 15 మంది కంటెస్టెంట్స్ ను షార్ట్ లిస్ట్ చేశారట. యూట్యూబ్, సోషల్ మీడియాకు చెందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.
షోని పది వారాలు ప్లాన్ చేశారు కాబట్టి దానికి తగ్గట్లుగా కంటెస్టెంట్స్ ఎంపిక ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ షో మొదలయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన సెట్స్ ను నిర్మిస్తున్నారట. మొత్తానికి ఈసారి సుత్తి లేకుండా.. పది వారాల్లో షోని ముగించేయాలని ప్లాన్ చేశారు. మరి ఈ ఐడియా ప్లస్ అవుతుందో లేదో చూడాలి!
This post was last modified on January 8, 2022 9:27 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…