బిగ్ బాస్ షో బుల్లితెరపై ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. విదేశాలకు చెందిన ఈ షో ఇప్పుడు ఇండియాలో కూడా బాగా ఫేమస్ అయింది. ముందుగా నార్త్ లో మొదలుపెట్టిన ఈ షోని మెల్లగా సౌత్ కి కూడా తీసుకొచ్చారు. తెలుగులో ఇప్పటికీ ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. రీసెంట్ గానే సీజన్ 5 ఫినాలే జరిగింది. ఈ సీజన్ విజేతగా సన్నీ నిలిచారు. ఇదిలా ఉండగా.. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలుకాబోతుంది.
అయితే ఈసారి ప్రత్యేకంగా ఓటీటీ కోసం ఈ షోని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘వూట్’లో బిగ్ బాస్ షోని టెలికాస్ట్ చేశారు. కానీ ఓటీటీ వెర్షన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే తెలుగులో డిఫరెంట్ గా ప్లాన్ చేసి.. ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ఈ షో కేవలం పది వారాలు మాత్రమే ఉంటుందట. సాధారణంగా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వంద రోజులకు పైగానే ఉంటుంది.
కానీ ఓటీటీ బిగ్ బాస్ మాత్రం కేవలం పది వారాలే ఉంటుందని సమాచారం. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ఈ షోకి నాగార్జున హోస్ట్ గా కనిపించనున్నారు. ఇప్పటికే దాదాపు 15 మంది కంటెస్టెంట్స్ ను షార్ట్ లిస్ట్ చేశారట. యూట్యూబ్, సోషల్ మీడియాకు చెందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.
షోని పది వారాలు ప్లాన్ చేశారు కాబట్టి దానికి తగ్గట్లుగా కంటెస్టెంట్స్ ఎంపిక ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ షో మొదలయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన సెట్స్ ను నిర్మిస్తున్నారట. మొత్తానికి ఈసారి సుత్తి లేకుండా.. పది వారాల్లో షోని ముగించేయాలని ప్లాన్ చేశారు. మరి ఈ ఐడియా ప్లస్ అవుతుందో లేదో చూడాలి!
This post was last modified on January 8, 2022 9:27 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…