ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్లో కేజీఎఫ్ 2 మొదటి వరుసలోనే ఉంది. ఫస్ట్ పార్ట్ ఐదు భాషల్లో విజయ ఢంకా మోగించడంతో సెకెండ్ చాప్టర్పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్ల లుక్స్తో పాటు టీజర్ కూడా దుమ్ము రేపింది. దాంతో మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
అయితే అన్ని సినిమాల్లాగే దీనికీ కరోనా అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. షూటింగ్ పూర్తై చాలా కాలమైనా మూవీ థియేటర్స్కి రాకుండా ఆగింది. ఎట్టకేలకి ఈ యేడు ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు ఫిక్సయ్యారు దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వీలు కాదేమో, వాయిదా తప్పదేమో అని సందేహ పడ్డారంతా. కానీ తాము అదే డేట్కి వస్తామంటూ టీమ్ కన్ఫర్మ్ చేసింది.
ఇవాళ యశ్ పుట్టినరోజు కావడంతో ఓ కొత్త పోస్టర్ను విడుదల చేసింది టీమ్. ఇది అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. అగ్రెసివ్గా నిలబడిన యశ్ దగ్గర డేంజర్ బోర్డ్ పెట్టి ఉంది. దానిపై ప్రమాదం రాబోతోందనే హెచ్చరిక రాసి ఉంది. దాన్నిబట్టి సెకెండ్ చాప్టర్లో యశ్ పాత్ర ఎంత డేంజరస్గా ఉండబోతోందో అర్థమయ్యింది.
ఈ సందర్భంగానే రిలీజ్ డేట్ని కూడా మరోసారి కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 14న రాఖీభాయ్ రచ్చ మొదలు కావడం గ్యారంటీ అంటున్నారు. ఇంకా మూడు నెలలు ఉంది కాబట్టి, అప్పటికి పరిస్థితులు చక్కబడే చాన్స్ ఉంది కాబట్టి ఇప్పటికి ఆ డేట్కి ఫిక్సవ్వడమే. అప్పుడేం జరుగుతుందో అప్పటి సిట్యుయేషన్ డిసైడ్ చేస్తుంది కనుక అంతవరకు వెయిట్ చేయడమే.
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…