తెలుగులో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయకుల్లో కార్తి ఒకడు. అన్న సూర్య లాగే ఇక్కడ అతను కూడా తనదైన ముద్ర వేయగలిగాడు. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖాకి లాంటి సినిమాలతో అతను తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కానీ గత కొన్నేళ్లలో అతడి సినిమాలు ఇక్కడ పెద్దగా ఆడలేదు.
కార్తి అనే కాదు.. సూర్య సహా చాలామంది తమిళ హీరోలు ఇక్కడ గతంలో ఉన్న మార్కెట్ను దెబ్బ తీసుకున్నారు. ఓవరాల్గా తమిళ సినిమాల క్వాలిటీ పడిపోవడం, మన సినిమాల రేంజ్ పెరగడమే అందుక్కారణం. ఐతే ఇప్పుడు ఏదైనా మంచి సినిమా చేసి మన వాళ్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాల్సింది పోయి.. తాను ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట చేసిన సినిమాను ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నాడు కార్తి.
దానికి మళ్లీ నా పేరు శివ-2 అని టైటిల్ కూడా పెట్టారు.
ఈ టైటిల్ చూసి ఇది నా పేరు శివకు సీక్వెల్ ఏమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ మద్రాస్ పేరుతో తీసిన సినిమా ఇది. కబాలి కంటే ముందు అతను చేసిన చిత్రమిది. తమిళంలో బాగానే ఆడింది. పోస్టర్లో కార్తి లుక్ చూస్తేనే ఇది పాత సినిమా అనే విషయం అర్థమైపోతుంది. ఓటీటీలు లేని రోజుల్లో అయితే కాస్త పాత సినిమాలు తీసుకొచ్చి అనువాదం చేసి రిలీజ్ చేసినా చెల్లేది.
కానీ ఇప్పుడు ప్రతి సినిమా ఓటీటీల్లో అందుబాటులో ఉండగా.. ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి సినిమాను నా పేరు శివ సీక్వెల్ లాగా భ్రమింపజేస్తూ రిలీజ్ చేయడం విడ్డూరం. ఇది తెలుగు ప్రేక్షకులను చులకనగా చూడటం తప్ప మరేం కాదు. ఒక రోజు ముందే వలిమై అనే తమిళ సినిమా తెలుగు వెర్షన్కు తమిళ టైటిలే పెట్టి పోస్టర్ రిలీజ్ చేయడం చూసి మన వాళ్లకు మండిపోయింది. ఇప్పుడిలా పాత సినిమాను కొత్త చిత్రంలా కలరింగ్ ఇస్తూ రిలీజ్ గురించి ప్రకటన చేయడం చూసి ఇంకా చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…