కోలీవుడ్ హీరో శింబు నటించిన లేటెస్ట్ సినిమా ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ గా నటించాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళనాట ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని.. దానికి సంబంధించిన హక్కులు గీతాఆర్ట్స్ చేతిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో అల్లు సిరీస్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్నారు.
అయితే నిజానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ తెలుగులో రీమేక్ చేయబోతుంది. ‘మానాడు’ సినిమాను కాపీ కొట్టి తెలుగులో ఓ సినిమా రూపొందిస్తున్నారని విషయం సురేష్ ప్రొడక్షన్స్ వరకు వెళ్లింది. అందుకే ‘మానాడు’ రీమేక్ రైట్స్ గురించి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సినిమా రీమేక్ హక్కులు తమ దగ్గర ఉన్నాయని.. కథలో ఏ భాగమైనా కాపీ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తోంది. గీతాఆర్ట్స్ దగ్గర కూడా టైమ్ లూప్ కాన్సెప్ట్ ఒకటి ఉందట. దానికి ‘మానాడు’ కథకి ఏమైనా సంబంధం ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి ‘మానాడు’ సినిమాను తెలుగులో డబ్ చేశారు.
కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయలేకపోయారు. కానీ ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ మాత్రం సోనీ లివ్ లో ఉంది. ‘మానాడు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పటికే చాలా మంది తెలుగు డబ్బింగ్ తో సినిమాను చూసేసారు. ఇలాంటి సమయంలో మళ్లీ రీమేక్ చేయడం సాహసమనే చెప్పాలి. మరేం చేస్తారో చూడాలి!
This post was last modified on January 5, 2022 3:25 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…