కోలీవుడ్ హీరో శింబు నటించిన లేటెస్ట్ సినిమా ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ గా నటించాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళనాట ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని.. దానికి సంబంధించిన హక్కులు గీతాఆర్ట్స్ చేతిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో అల్లు సిరీస్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్నారు.
అయితే నిజానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ తెలుగులో రీమేక్ చేయబోతుంది. ‘మానాడు’ సినిమాను కాపీ కొట్టి తెలుగులో ఓ సినిమా రూపొందిస్తున్నారని విషయం సురేష్ ప్రొడక్షన్స్ వరకు వెళ్లింది. అందుకే ‘మానాడు’ రీమేక్ రైట్స్ గురించి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సినిమా రీమేక్ హక్కులు తమ దగ్గర ఉన్నాయని.. కథలో ఏ భాగమైనా కాపీ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తోంది. గీతాఆర్ట్స్ దగ్గర కూడా టైమ్ లూప్ కాన్సెప్ట్ ఒకటి ఉందట. దానికి ‘మానాడు’ కథకి ఏమైనా సంబంధం ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి ‘మానాడు’ సినిమాను తెలుగులో డబ్ చేశారు.
కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయలేకపోయారు. కానీ ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ మాత్రం సోనీ లివ్ లో ఉంది. ‘మానాడు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పటికే చాలా మంది తెలుగు డబ్బింగ్ తో సినిమాను చూసేసారు. ఇలాంటి సమయంలో మళ్లీ రీమేక్ చేయడం సాహసమనే చెప్పాలి. మరేం చేస్తారో చూడాలి!
This post was last modified on January 5, 2022 3:25 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…