2021 సంవత్సరానికి అదిరిపోయే ముగింపును ఇచ్చాయి అఖండ, పుష్ప సినిమాలు. వీటికి టాక్ మరీ గొప్పగా ఏమీ రాలేదు. కానీ బాక్సాఫీస్ దగ్గర అన్నీ భలేగా కలిసొచ్చాయి. దీంతో వసూళ్ల మోత మోగిపోయింది. వాటి లాంగ్ థియేట్రికల్ రన్ చూసి అందరూ విస్తుబోతున్నారు. ఎంత మంచి టాక్ వచ్చినా రెండో వారం తర్వాత కొత్త సినిమాలు డల్ అయిపోతున్న రోజుల్లో ఇవి మూడో వారంలోనూ అదరగొట్టాయి. ‘అఖండ’కు ఇప్పటికీ వీకెండ్స్లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
‘పుష్ప’ అయితే ఒక కొత్త సినిమాలాగా వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. ఐతే థియేటర్లకు వెళ్లి చూసేవాళ్లు బాగానే చూస్తున్నప్పటికీ.. వెళ్లలేని వాళ్లు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మామూలుగా పెద్ద సినిమాలను కూడా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి తెస్తున్న నేపథ్యంలో ‘అఖండ’ ఇంకా డిజిటల్ రిలీజ్ కాలేదంటి అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్ గురించి జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
ఐతే ‘పుష్ప’ అమేజాన్ ప్రైమ్లోకి మరి కొన్ని రోజుల్లోనే రాబోతోందనే ప్రచారాన్ని నిర్మాతలు ఖండించారు.
ఐతే వాళ్లు ఖండించినప్పటికీ.. ఈ నెల ఏడో తారీఖునే ఈ సినిమా ప్రైమ్లో రిలీజ్ కాబోతోందని సమాచారం. ఈమేరకు చాలా ముందుగానే ఒప్పందం జరిగిందట. 7న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజవుతుంది కాబట్టి అప్పటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆటోమేటిగ్గా ముగిసిపోతుంది కాబట్టి ఆ రోజు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల ఇబ్బందేమీ ఉండదనుకున్నారు.
కానీ అనూహ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది. ‘పుష్ప’ మూడు వారంలోనూ నార్త్ ఇండియాలో ఇరగాడేస్తోంది. దీంతో థియేటర్లలో ఇంత బాగా ఆడుతున్న సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి కలెక్షన్లను పోగొట్టుకోవడం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. ఐతే డీల్ రివైజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని 7నే ప్రైమ్లో రిలీజ్ కాబోతోందని గట్టిగానే వార్తలొస్తున్నాయి. ఇక ‘అఖండ’ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న హాట్ స్టార్లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…