2021 సంవత్సరానికి అదిరిపోయే ముగింపును ఇచ్చాయి అఖండ, పుష్ప సినిమాలు. వీటికి టాక్ మరీ గొప్పగా ఏమీ రాలేదు. కానీ బాక్సాఫీస్ దగ్గర అన్నీ భలేగా కలిసొచ్చాయి. దీంతో వసూళ్ల మోత మోగిపోయింది. వాటి లాంగ్ థియేట్రికల్ రన్ చూసి అందరూ విస్తుబోతున్నారు. ఎంత మంచి టాక్ వచ్చినా రెండో వారం తర్వాత కొత్త సినిమాలు డల్ అయిపోతున్న రోజుల్లో ఇవి మూడో వారంలోనూ అదరగొట్టాయి. ‘అఖండ’కు ఇప్పటికీ వీకెండ్స్లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
‘పుష్ప’ అయితే ఒక కొత్త సినిమాలాగా వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. ఐతే థియేటర్లకు వెళ్లి చూసేవాళ్లు బాగానే చూస్తున్నప్పటికీ.. వెళ్లలేని వాళ్లు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మామూలుగా పెద్ద సినిమాలను కూడా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి తెస్తున్న నేపథ్యంలో ‘అఖండ’ ఇంకా డిజిటల్ రిలీజ్ కాలేదంటి అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్ గురించి జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
ఐతే ‘పుష్ప’ అమేజాన్ ప్రైమ్లోకి మరి కొన్ని రోజుల్లోనే రాబోతోందనే ప్రచారాన్ని నిర్మాతలు ఖండించారు.
ఐతే వాళ్లు ఖండించినప్పటికీ.. ఈ నెల ఏడో తారీఖునే ఈ సినిమా ప్రైమ్లో రిలీజ్ కాబోతోందని సమాచారం. ఈమేరకు చాలా ముందుగానే ఒప్పందం జరిగిందట. 7న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజవుతుంది కాబట్టి అప్పటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆటోమేటిగ్గా ముగిసిపోతుంది కాబట్టి ఆ రోజు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల ఇబ్బందేమీ ఉండదనుకున్నారు.
కానీ అనూహ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది. ‘పుష్ప’ మూడు వారంలోనూ నార్త్ ఇండియాలో ఇరగాడేస్తోంది. దీంతో థియేటర్లలో ఇంత బాగా ఆడుతున్న సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి కలెక్షన్లను పోగొట్టుకోవడం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. ఐతే డీల్ రివైజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని 7నే ప్రైమ్లో రిలీజ్ కాబోతోందని గట్టిగానే వార్తలొస్తున్నాయి. ఇక ‘అఖండ’ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న హాట్ స్టార్లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.
This post was last modified on January 4, 2022 5:51 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…