‘పుష్ప’ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుంటే.. బయటి వాళ్లే కాదు.. స్వయంగా ఆ చిత్ర దర్శకుడు సుకుమారే లోలోన నవ్వుకున్నాడట. ఆయన ఈ చిత్రాన్ని తెలుగు సినిమాగానే చూశాడట. మహా అయితే మలయాళంలో అల్లు అర్జున్కున్న ఫాలోయింగ్ వల్ల ఆడొచ్చేమో కానీ.. వేరే భాషల్లో ఈ సినిమా ప్రభావం చూపుతుందన్న ఆశలేమీ లేవట ఆయనకి. సుకుమార్ అనే కాదు.. చాలామంది అంచనా ఇదే.
పేరుకే ఇది పాన్ ఇండియా రిలీజ్ అవుతోందని.. ఉత్తరాదిన, తమిళనాడులో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోకపోవచ్చని అనుకున్నారు. అందులోనూ రిలీజ్ ముంగిట బాగా హడావుడి అవడం, పోస్ట్ ప్రొడక్షన్ సరిగా చేయకపోవడం.. ప్రమోషన్లు లేకపోవడంతో ‘పుష్ప’ వేరే భాషల్లో ‘పుష్ప’ ప్రభావం మీద మరింత సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో సాధిస్తున్న వసూళ్లు చూసి ఇప్పుడు అందరూ విస్తుబోతున్నారు. హిందీ వెర్షన్ ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.
ఫుల్ రన్లో రూ.100 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. తమిళంలో రూ.25 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసింది. కేరళ వసూళ్లు రూ.15 కోట్లకు చేరువగా ఉన్నాయి. ఈ సినిమాకు ఈ ఫిగర్స్ ఎవ్వరూ ఊహించనివి. ఈ సినిమా ఆయా భాషల్లో బ్లాక్బస్టర్ స్టేటస్ అందుకుంది. దీంతో ఆటోమేటిగ్గా ‘పుష్ప-2’పై అంచనాలు, అలాగే బిజినెస్ పెరిగిపోతాయనడంలో సందేహం లేదు. ‘పుష్ప-1’ విషయంలో సుకుమార్కు టైం లేక కొన్ని తప్పులు కూడా చేశాడు.
హడావుడి పడ్డాడు. ‘పుష్ప-2’ విషయంలో ఆయన కచ్చితంగా జాగ్రత్త పడి పకడ్బందీగా సినిమా తీస్తాడనడంలో సందేహం లేదు. అసలు కథంగా సెకండ్ పార్ట్లో ఉందని చెప్పడం కూడా ఎగ్జైట్ చేసేదే. కాబట్టి ‘పుష్ప-2’ ఇంకా మెరుగ్గా ఉండి, దీనిపై ఉన్న ఆసక్తిని ఇంకా పెంచేలా ప్రమోషన్లు చేస్తే హైప్ మామూలుగా ఉండదు. ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం. నాన్-బాహుబలి, రాజమౌళి, ప్రభాస్ సినిమాల రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టేస్తుందేమో.
This post was last modified on January 4, 2022 2:13 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…