దాదాపు అయిదేళ్లు కావస్తోంది ఒక మలయాళ స్టార్ హీరోయిన్ మీద లైంగిక దాడి జరిగి. అక్కడి టాప్ స్టార్లలో ఒకడైన దిలీపే ప్లాన్ చేసి ఈ దాడి చేయించాడని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఈ కేసులో అతను అరెస్టయి కొన్ని నెలలు జైల్లో గడిపాడు కూడా. దిలీప్ ఆదేశాల మేరకే పల్సర్ సుని అనే ఒక కిరాయి గూండా సదరు కథానాయికను కిడ్నాప్ చేసి కార్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆమెమానసికంగా కుంగిపోయేలా చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ కేసు అప్పట్లో పెను సంచలనం. ఆ కథనాయికకు ఇండస్ట్రీ నుంచే కాక అన్ని వైపుల నుంచీ పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దిలీప్ను అందరూ విలన్ లాగే చూశారు. అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, ఈ కేసులో అతను తప్పించుకోవడం సాధ్యం కాదని, కచ్చితంగా శిక్ష పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ జరగలేదు.
బెయిల్ మీద బయటికి వచ్చిన దిలీప్ ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నాడు.
ఈ కేసు చూస్తే ఎటూ తేలకుండా ఉంది. కాగా ఇప్పుడీ కేసు వ్యవహారం మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాధిత కథానాయిక తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరు మారిపోతుండటం గమనార్హం. ఈ కేసులో జడ్జి పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరు ఈ కేసు నుంచి తప్పుకున్నారట. ఈ మేరకు సదరు కథానాయిక ముఖ్యమంత్రి పినరపి విజయన్కు లేఖ రాసింది.
ఈ కేసును నీరుగార్చడానికి నిందితులు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని, ధన బలం చూపిస్తున్నారని, కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగట్లేదని, వెంటనే జోక్యం చేసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె ఈ లేఖలో కోరింది. దీనిపై సింగర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ చిన్మయి స్పందిస్తూ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఎప్పడూ ఇలాగే అన్యాయమే జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
This post was last modified on January 3, 2022 10:11 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…