దాదాపు అయిదేళ్లు కావస్తోంది ఒక మలయాళ స్టార్ హీరోయిన్ మీద లైంగిక దాడి జరిగి. అక్కడి టాప్ స్టార్లలో ఒకడైన దిలీపే ప్లాన్ చేసి ఈ దాడి చేయించాడని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఈ కేసులో అతను అరెస్టయి కొన్ని నెలలు జైల్లో గడిపాడు కూడా. దిలీప్ ఆదేశాల మేరకే పల్సర్ సుని అనే ఒక కిరాయి గూండా సదరు కథానాయికను కిడ్నాప్ చేసి కార్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆమెమానసికంగా కుంగిపోయేలా చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ కేసు అప్పట్లో పెను సంచలనం. ఆ కథనాయికకు ఇండస్ట్రీ నుంచే కాక అన్ని వైపుల నుంచీ పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దిలీప్ను అందరూ విలన్ లాగే చూశారు. అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, ఈ కేసులో అతను తప్పించుకోవడం సాధ్యం కాదని, కచ్చితంగా శిక్ష పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ జరగలేదు.
బెయిల్ మీద బయటికి వచ్చిన దిలీప్ ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నాడు.
ఈ కేసు చూస్తే ఎటూ తేలకుండా ఉంది. కాగా ఇప్పుడీ కేసు వ్యవహారం మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాధిత కథానాయిక తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరు మారిపోతుండటం గమనార్హం. ఈ కేసులో జడ్జి పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరు ఈ కేసు నుంచి తప్పుకున్నారట. ఈ మేరకు సదరు కథానాయిక ముఖ్యమంత్రి పినరపి విజయన్కు లేఖ రాసింది.
ఈ కేసును నీరుగార్చడానికి నిందితులు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని, ధన బలం చూపిస్తున్నారని, కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగట్లేదని, వెంటనే జోక్యం చేసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె ఈ లేఖలో కోరింది. దీనిపై సింగర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ చిన్మయి స్పందిస్తూ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఎప్పడూ ఇలాగే అన్యాయమే జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
This post was last modified on January 3, 2022 10:11 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…