దాదాపు అయిదేళ్లు కావస్తోంది ఒక మలయాళ స్టార్ హీరోయిన్ మీద లైంగిక దాడి జరిగి. అక్కడి టాప్ స్టార్లలో ఒకడైన దిలీపే ప్లాన్ చేసి ఈ దాడి చేయించాడని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఈ కేసులో అతను అరెస్టయి కొన్ని నెలలు జైల్లో గడిపాడు కూడా. దిలీప్ ఆదేశాల మేరకే పల్సర్ సుని అనే ఒక కిరాయి గూండా సదరు కథానాయికను కిడ్నాప్ చేసి కార్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆమెమానసికంగా కుంగిపోయేలా చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ కేసు అప్పట్లో పెను సంచలనం. ఆ కథనాయికకు ఇండస్ట్రీ నుంచే కాక అన్ని వైపుల నుంచీ పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దిలీప్ను అందరూ విలన్ లాగే చూశారు. అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, ఈ కేసులో అతను తప్పించుకోవడం సాధ్యం కాదని, కచ్చితంగా శిక్ష పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ జరగలేదు.
బెయిల్ మీద బయటికి వచ్చిన దిలీప్ ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నాడు.
ఈ కేసు చూస్తే ఎటూ తేలకుండా ఉంది. కాగా ఇప్పుడీ కేసు వ్యవహారం మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాధిత కథానాయిక తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరు మారిపోతుండటం గమనార్హం. ఈ కేసులో జడ్జి పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరు ఈ కేసు నుంచి తప్పుకున్నారట. ఈ మేరకు సదరు కథానాయిక ముఖ్యమంత్రి పినరపి విజయన్కు లేఖ రాసింది.
ఈ కేసును నీరుగార్చడానికి నిందితులు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని, ధన బలం చూపిస్తున్నారని, కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగట్లేదని, వెంటనే జోక్యం చేసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె ఈ లేఖలో కోరింది. దీనిపై సింగర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ చిన్మయి స్పందిస్తూ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఎప్పడూ ఇలాగే అన్యాయమే జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
This post was last modified on January 3, 2022 10:11 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…