‘పుష్ప’ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈపాటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయిపోయి ఉండాలి. కానీ తర్వాతి వారాల్లో దానికి పోటీనిచ్చే పెద్ద సినిమాలు రాకపోవడం, హిందీలో జెర్సీ మూవీ, అలాగే పాన్ ఇండియా మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటం దీనికి భలేగా కలిసొస్తోంది. విడుదలకు ముందు ఉన్న హైప్ వల్ల తొలి వారం భారీ వసూళ్లు వస్తే.. రెండో వారంలో క్రిస్మస్ సీజన్ కలిసొచ్చింది.
దీంతో ఆ సినిమా వసూళ్లు అంచనాలను మించిపోయాయి. హిందీలో అనూహ్యంగా ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి బ్లాక్బస్టర్ స్టేటస్ అందుకుందీ చిత్రం. తమిళం, మలయాళంలోనూ ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోంది. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే తెలంగాణలో ఆల్రెడీ ‘పుష్ప’ బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేసింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు మంచి లాభాలే వచ్చేలా ఉన్నాయి.
ఐతే ‘పుష్ఫ’కు ఇంతగా కలిసొచ్చినా.. దాని థియేట్రికల్ రన్ ఎక్స్టెండ్ అయినా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడానికి కష్టపడుతోంది. మూడో వారాంతంలోనూ సినిమాకు హౌస్ ఫుల్స్ పడినా.. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కు దూరంగానే ఉంది ‘పుష్ప’. సీడెడ్లో ఈ సినిమా థియేట్రకల్ హక్కులను రూ.18 కోట్లకు అమ్మితే.. ఈ ఆదివారం నాటికి అక్కడ షేర్ రూ.15.70 కోట్లు వచ్చింది.
అంటే ఇంకా 2.2 కోట్లు వస్తే కానీ ఈ చిత్రం బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకురాదన్నమాట. సంక్రాంతి వరకు ‘పుష్ప’ రన్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి సీడెడ్లో కష్టపడి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులున్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం అది కష్టంగానే ఉంది. అక్కడ ‘పుష్ప’ హక్కులు రూ.48 కోట్లు పలికాయి. ఇప్పటిదాకా అక్కడ వచ్చిన షేర్ రూ.35 కోట్ల లోపే. ఎంత కష్టపడ్డా కూడా షేర్ రూ.40 కోట్లు వస్తే ఎక్కువ. చివరికి ఆంధ్రాలో మాత్రం ‘పుష్ప’ ఫ్లాప్గానే నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పాపం కచ్చితంగా టికెట్ల రేట్లదే అనడంలో సందేహం లేదు.
This post was last modified on January 3, 2022 4:15 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…