‘పుష్ప’ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈపాటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయిపోయి ఉండాలి. కానీ తర్వాతి వారాల్లో దానికి పోటీనిచ్చే పెద్ద సినిమాలు రాకపోవడం, హిందీలో జెర్సీ మూవీ, అలాగే పాన్ ఇండియా మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటం దీనికి భలేగా కలిసొస్తోంది. విడుదలకు ముందు ఉన్న హైప్ వల్ల తొలి వారం భారీ వసూళ్లు వస్తే.. రెండో వారంలో క్రిస్మస్ సీజన్ కలిసొచ్చింది.
దీంతో ఆ సినిమా వసూళ్లు అంచనాలను మించిపోయాయి. హిందీలో అనూహ్యంగా ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి బ్లాక్బస్టర్ స్టేటస్ అందుకుందీ చిత్రం. తమిళం, మలయాళంలోనూ ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోంది. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే తెలంగాణలో ఆల్రెడీ ‘పుష్ప’ బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేసింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు మంచి లాభాలే వచ్చేలా ఉన్నాయి.
ఐతే ‘పుష్ఫ’కు ఇంతగా కలిసొచ్చినా.. దాని థియేట్రికల్ రన్ ఎక్స్టెండ్ అయినా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడానికి కష్టపడుతోంది. మూడో వారాంతంలోనూ సినిమాకు హౌస్ ఫుల్స్ పడినా.. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కు దూరంగానే ఉంది ‘పుష్ప’. సీడెడ్లో ఈ సినిమా థియేట్రకల్ హక్కులను రూ.18 కోట్లకు అమ్మితే.. ఈ ఆదివారం నాటికి అక్కడ షేర్ రూ.15.70 కోట్లు వచ్చింది.
అంటే ఇంకా 2.2 కోట్లు వస్తే కానీ ఈ చిత్రం బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకురాదన్నమాట. సంక్రాంతి వరకు ‘పుష్ప’ రన్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి సీడెడ్లో కష్టపడి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులున్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం అది కష్టంగానే ఉంది. అక్కడ ‘పుష్ప’ హక్కులు రూ.48 కోట్లు పలికాయి. ఇప్పటిదాకా అక్కడ వచ్చిన షేర్ రూ.35 కోట్ల లోపే. ఎంత కష్టపడ్డా కూడా షేర్ రూ.40 కోట్లు వస్తే ఎక్కువ. చివరికి ఆంధ్రాలో మాత్రం ‘పుష్ప’ ఫ్లాప్గానే నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పాపం కచ్చితంగా టికెట్ల రేట్లదే అనడంలో సందేహం లేదు.
This post was last modified on January 3, 2022 4:15 pm
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…
టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల…