‘పుష్ప’ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈపాటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయిపోయి ఉండాలి. కానీ తర్వాతి వారాల్లో దానికి పోటీనిచ్చే పెద్ద సినిమాలు రాకపోవడం, హిందీలో జెర్సీ మూవీ, అలాగే పాన్ ఇండియా మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటం దీనికి భలేగా కలిసొస్తోంది. విడుదలకు ముందు ఉన్న హైప్ వల్ల తొలి వారం భారీ వసూళ్లు వస్తే.. రెండో వారంలో క్రిస్మస్ సీజన్ కలిసొచ్చింది.
దీంతో ఆ సినిమా వసూళ్లు అంచనాలను మించిపోయాయి. హిందీలో అనూహ్యంగా ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి బ్లాక్బస్టర్ స్టేటస్ అందుకుందీ చిత్రం. తమిళం, మలయాళంలోనూ ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోంది. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే తెలంగాణలో ఆల్రెడీ ‘పుష్ప’ బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేసింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు మంచి లాభాలే వచ్చేలా ఉన్నాయి.
ఐతే ‘పుష్ఫ’కు ఇంతగా కలిసొచ్చినా.. దాని థియేట్రికల్ రన్ ఎక్స్టెండ్ అయినా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడానికి కష్టపడుతోంది. మూడో వారాంతంలోనూ సినిమాకు హౌస్ ఫుల్స్ పడినా.. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కు దూరంగానే ఉంది ‘పుష్ప’. సీడెడ్లో ఈ సినిమా థియేట్రకల్ హక్కులను రూ.18 కోట్లకు అమ్మితే.. ఈ ఆదివారం నాటికి అక్కడ షేర్ రూ.15.70 కోట్లు వచ్చింది.
అంటే ఇంకా 2.2 కోట్లు వస్తే కానీ ఈ చిత్రం బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకురాదన్నమాట. సంక్రాంతి వరకు ‘పుష్ప’ రన్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి సీడెడ్లో కష్టపడి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులున్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం అది కష్టంగానే ఉంది. అక్కడ ‘పుష్ప’ హక్కులు రూ.48 కోట్లు పలికాయి. ఇప్పటిదాకా అక్కడ వచ్చిన షేర్ రూ.35 కోట్ల లోపే. ఎంత కష్టపడ్డా కూడా షేర్ రూ.40 కోట్లు వస్తే ఎక్కువ. చివరికి ఆంధ్రాలో మాత్రం ‘పుష్ప’ ఫ్లాప్గానే నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పాపం కచ్చితంగా టికెట్ల రేట్లదే అనడంలో సందేహం లేదు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…