హైదరాబాద్లో కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్న వాళ్లకు శివ పార్వతి థియేటర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిటీలోనే మంచి పేరున్న థియేటర్లలో ఒకటది. అక్కడ ఎప్పుడూ పేరున్న సినిమాలే రిలీజవుతుంటాయి. పెద్ద హీరోల సినిమాలకు అప్పుడప్పుడూ ఫ్యాన్స్ షోలు వేయడానికి కూడా ఈ థియేటర్నే ఎంచుకుంటూ ఉంటారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కు కూడా స్పెషల్ షో అక్కడే వేశారు.
ఈ ఫేమస్ థియేటర్ ఇప్పుడు అగ్ని ప్రమాదం కారణంగా నామరూపాల్లేకుండా నాశనం కావడం ఆ ప్రాంత సినీ ప్రేమికుల్ని కలచి వేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు థియేటర్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. సినిమా హాలులోని స్క్రీన్, కుర్చీలు, ఇతర సామగ్రి కాలి బూడిదైంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో పైకప్పు కూడా కూలిపోవడం గమనార్హం.
ఈ థియేటర్లో పది రోజుల నుంచి నాని సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ఆడుతోంది. ఆదివారం కూడా ఈ సినిమా సెకండ్ షోను నడిపించారు. ఐతే షో పూర్తయ్యాక కాసేపటికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ సమయానికి థియేటర్లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. థియేటర్ వెలుపల ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించేసరికే లోపల పరిస్థితి అదుపు తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే థియేటర్ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. మూడు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కాకుండా వేరే కారణాలేవీ లేవనే భావిస్తున్నారు. ప్రమాదంలో దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. థియేటర్ కాలిపోతోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…