‘పుష్ప’ సినిమా రిలీజై రెండు వారాలు దాటింది. మూడో వారంలోకి అడుగు పెట్టిన ఈ చిత్రం నార్త్ ఇండియాలో సాధిస్తున్న వసూళ్లకు అక్కడి ట్రేడ్ పండిట్లు విస్తుబోతున్నారు. ఈ వారం రావాల్సిన ‘జెర్సీ’ సినిమా వాయిదా పడటంతో ‘పుష్ప’ పండగ చేసుకుంటోంది. ఈ శనివారం ‘పుష్ప’ సాధించిన వసూళ్లు చూసి బాలీవుడ్ వాళ్లకు దిమ్మదిరిగిపోతోంది. విడుదలైన 16వ రోజు ఆ చిత్రం హిందీలో ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా రిలీజైన ఇన్ని రోజుల తర్వాత ఈ వసూళ్లు రావడం కష్టం. ఈ ఏడాది హిందీలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘సూర్యవంశీ’ మూడో వారాంతంలో, రిలీజైన 16వ రోజు రూ.3.77 కోట్ల గ్రాసే కలెక్ట్ చేసింది. అలాంటిది ఒక డబ్బింగ్ సినిమా, రిలీజ్ ముంగిట పెద్దగా అంచనాలు కూడా లేని చిత్రం మూడో వీకెండ్లో ఒక్క రోజులో ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇంకా పెద్ద విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ‘పుష్ఫ’ ఒక్క రోజులో కలెక్ట్ చేసిన అత్యధిక మొత్తం కూడా ఇదే. తొలి రోజు, తొలి వారాంతంలో కూడా ఏ రోజూ ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. ఒక సినిమాకు విడుదలైన 16వ రోజు హైయెస్ట్ సింగిల్ డే కలెక్షన్లు రావడం అన్నది బహుశా ఒక రికార్డు కావచ్చేమో. నెమ్మదిగా ‘పుష్ప’ హిందీ జనాలకు బాగా ఎక్కేస్తోందనడానికి ఇది రుజువు. ‘పుష్ప’ హిందీలో ఇంత బాగా ఆడుతుందన్న అంచనాలు ఎవ్వరికీ లేవు.
ఈ చిత్ర దర్శకుడు సుకుమారే ఈ విషయంలో షాకవుతున్నాడు. హిందీలో రిలీజ్ గురించి హడావుడి చేస్తుంటే తాను లోలోన నవ్వుకున్నట్లుగా సుకుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తంగా శనివారం నాటికి ఈ చిత్రం హిందీలో రూ.57 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘జెర్సీ’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సైతం వాయిదా పడటంతో ‘పుష్ప’ డ్రీమ్ రన్ ఇంకా కొన్ని రోజులు కొనసాగబోతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం అక్కడ రూ.75 కోట్ల గ్రాస్ మార్కును కూడా ఈజీగానే టచ్ చేసేలా ఉంది.
This post was last modified on January 2, 2022 2:26 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…