అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ రోజు హిందీ సినిమా ‘జెర్సీ’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావాల్సింది. కానీ విడుదలకు కేవలం నాలుగు రోజుల ముందు ఈ చిత్రానికి బ్రేక్ పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో థియేటర్లు మూత పడటం.. ఉత్తరాదిన మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు పెట్టే సూచనలు కనిపిస్తుండటంతో ఈ చిత్రాన్ని హఠాత్తుగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
తర్వాత ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. కరోనా తీవ్రత ఇంకా పెరిగేలా ఉందే తప్ప తగ్గేలా లేదు. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ పరిస్థితి అగమ్య గోచరంగా మారేలా ఉంది. ఇప్పటికే సినిమా వాయిదాల మీద వాయిదా పడి చాలా ఆలస్యం అయింది. దీంతో ‘జెర్సీ’ని ఓటీటీలో రిలీజ్ చేయడంపై నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సీరియస్గా ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ అనిశ్చితి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కాబట్టి ఓటీటీకి వెళ్లడమే ఉత్తమం అనుకుంటున్నారట.ఐతే హీరో షాహిద్ కపూర్ మాత్రం ‘జెర్సీ’ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ససేమిరా అంటున్నాడట. ‘జెర్సీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందని అతను బలంగా నమ్ముతున్నాడు. ఇంతకుముందు అతను ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ చేయగా.. ఆ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. షాహిద్ ఇమేజ్, మార్కెట్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అతణ్ని నెక్స్ట్ లీగ్లోకి తీసుకెళ్లింది.
‘జెర్సీ’ సినిమా తనను ఇంకో మెట్టు ఎక్కిస్తుందని, ఇంకా పెద్ద స్టార్ను చేస్తుందని.. థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇదని అతను భావిస్తున్నాడు. అందుకే తాను పారితోషకంగా తీసుకున్న రూ.31 కోట్ల నుంచి ఐదు కోట్లో, పది కోట్లో.. ఎంత కావాలంటే అంత కోత వేసుకోవడానికి సిద్ధమని, కానీ ఈ చిత్రాన్ని ఓటీటీలో మాత్రం రిలీజ్ చేయొద్దని.. కొన్నాళ్లు హోల్డ్ చేసి థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలను అతను గట్టిగా కోరుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి దిల్ రాజు అండ్ కో ఇందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…