అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ రోజు హిందీ సినిమా ‘జెర్సీ’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావాల్సింది. కానీ విడుదలకు కేవలం నాలుగు రోజుల ముందు ఈ చిత్రానికి బ్రేక్ పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో థియేటర్లు మూత పడటం.. ఉత్తరాదిన మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు పెట్టే సూచనలు కనిపిస్తుండటంతో ఈ చిత్రాన్ని హఠాత్తుగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
తర్వాత ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. కరోనా తీవ్రత ఇంకా పెరిగేలా ఉందే తప్ప తగ్గేలా లేదు. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ పరిస్థితి అగమ్య గోచరంగా మారేలా ఉంది. ఇప్పటికే సినిమా వాయిదాల మీద వాయిదా పడి చాలా ఆలస్యం అయింది. దీంతో ‘జెర్సీ’ని ఓటీటీలో రిలీజ్ చేయడంపై నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సీరియస్గా ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ అనిశ్చితి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కాబట్టి ఓటీటీకి వెళ్లడమే ఉత్తమం అనుకుంటున్నారట.ఐతే హీరో షాహిద్ కపూర్ మాత్రం ‘జెర్సీ’ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ససేమిరా అంటున్నాడట. ‘జెర్సీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందని అతను బలంగా నమ్ముతున్నాడు. ఇంతకుముందు అతను ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ చేయగా.. ఆ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. షాహిద్ ఇమేజ్, మార్కెట్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అతణ్ని నెక్స్ట్ లీగ్లోకి తీసుకెళ్లింది.
‘జెర్సీ’ సినిమా తనను ఇంకో మెట్టు ఎక్కిస్తుందని, ఇంకా పెద్ద స్టార్ను చేస్తుందని.. థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇదని అతను భావిస్తున్నాడు. అందుకే తాను పారితోషకంగా తీసుకున్న రూ.31 కోట్ల నుంచి ఐదు కోట్లో, పది కోట్లో.. ఎంత కావాలంటే అంత కోత వేసుకోవడానికి సిద్ధమని, కానీ ఈ చిత్రాన్ని ఓటీటీలో మాత్రం రిలీజ్ చేయొద్దని.. కొన్నాళ్లు హోల్డ్ చేసి థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలను అతను గట్టిగా కోరుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి దిల్ రాజు అండ్ కో ఇందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి.
This post was last modified on December 31, 2021 12:41 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…