‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు యువ దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఐతే తొలి సినిమా తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయాడు. రెండో చిత్రం ‘ఒక లైలా కోసం’ ఓ మోస్తరుగా ఆడగా.. ఆ తర్వాత అతణ్నుంచి వచ్చిన ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే పూర్తిగా నిరాశ పరిచాయి. టాలీవుడ్లో అతడి కెరీర్కు దాదాపుగా బ్రేకులు పడ్డట్లే కనిపిస్తోంది. ఐతే ఈలోపు విజయ్కి కన్నడలో మంచి అవకాశం వచ్చింది.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ హీరోగా నటించిన చిత్రమిది. ఇతను ‘జాగ్వార్’ అనే మూవీతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత విజయేంద్ర ప్రసాద్ రచనలో, రాజమౌళి శిష్యుడు మహదేవ్ దాదాపు 75 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీశాడు. కానీ అది నిఖిల్కు హిట్ అందించలేకపోయింది. ఆ తర్వాత కూడా సరైన విజయాలు దక్కలేదతడికి.
ఇప్పుడు నిఖిల్ను హీరోగా నిలబెట్టే బాధ్యత విజయ్పై పడింది. వీరి కలయికలో ‘రైడర్’ అనే సినిమా తెరకెక్కింది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రైడర్’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మాజీ సీఎం కొడుకు సినిమా, పైగా సొంత బేనర్లో తెరకెక్కింది కాబట్టి ఖర్చు పరంగా రాజీయే లేదు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో, పేరున్న కాస్ట్ అండ్ క్రూతో సినిమా తీశారు. కానీ ప్రొడక్షన్ క్వాలిటీ కనిపించినా.. కథాకథనాలు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలే వచ్చాయి.
చిన్నపుడు అనాథాశ్రమంలో పెరిగిన మధ్యలో విడిపోయిన హీరో హీరోయిన్లు.. తిరిగి ఒకరినొకరు ఎలా కలిశారన్న కథకు కమర్షియల్ టచ్ ఇస్తూ విజయ్ సినిమా తీశాడు. కథ పరంగా కొత్తదనం లేకపోవడం.. ట్రీట్మెంట్ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాల తరహాలోనే ఉండటంతో సినిమాకు ఆశించినంత స్పందన రాలేదు. ఓపెనింగ్స్ పర్లేదనిపించినా.. బాక్సాఫీస్ దగ్గర సినిమా నిలబడలేదని అక్కడి క్రిటిక్స్, ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. కానీ చిత్ర బృందం సినిమా బ్లాక్బస్టర్ అంటూ విజయయాత్ర చేస్తోంది.
This post was last modified on December 30, 2021 7:23 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…