ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ బాగా క్లిక్ అవుతుంటాయి. అది హీరో హీరోయిన్లు కావొచ్చు.. దర్శకుడు నిర్మాత కావచ్చు.. హీరో దర్శకుడూ కూడా అయ్యుండొచ్చు. ఈ మూడో కేటగిరీకి చెందినవారే మలయాళ హీరోలు మోహన్లాల్, పృథ్విరాజ్ సుకుమారన్. వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబో అనడంలో సందేహమే లేదు.
ఓ సినిమా తీసి, అది సక్సెస్ అయితే మళ్లీ మళ్లీ పని చేసేవారు ఉంటారు. కానీ వీళ్ల రూటే వేరు. పృథ్విరాజ్కి మోహన్లాల్ అంటే వల్లమాలిన అభిమానం, ఆరాధన. ఓ స్టార్ హీరో అయ్యుండి కూడా ఏమాత్రం ఇగో లేకుండా లాల్కి వీరాభిమానిని అని చెప్పుకుంటాడు. ఆ అభిమానంతోనే లూసిఫర్ సినిమా తీశాడు. అందులో మోహన్లాల్ ఎలివేషన్లు అదిరిపోవడానికి కారణం ఆయనపై పృథ్విరాజ్కి ఉన్న ఇష్టమే. తన ఫేవరేట్ హీరోని అలా చూపించేందుకే ఆ సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇప్పుడు మరోసారి ఆయనతో బ్రోడాడీ అనే సినిమా తీస్తున్నాడు పృథ్వి. పేరుతోనే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సినిమాని నలభై నాలుగు రోజుల్లోనే షూట్ చేసేశాడు. మొత్తం హైదరాబాద్లోనే తీశాడు. ఆంటోనీ పెరంబవూర్తో కలిసి నిర్మిస్తున్నాడు కూడా. లూసిఫర్లో చిన్న పాత్రలో కనిపించినవాడు ఈ సినిమాలో లాల్తో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. జనవరి 26న మూవీ హాట్స్టార్లో రిలీజ్ కానుంది. ఇవాళ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. సూటూ బూటూ వేసుకుని యమా స్టైలిష్గా, రిచ్ లుక్లో ఉన్నారిద్దరూ. చూసినవాళ్లంతా హిట్ పెయిర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే ఈ హిట్ పెయిర్ మరోసారి కూడా రిపీట్ కానుంది. మరో మూవీకి కూడా ఇద్దరూ కలిసి పని చేయబోతున్నారు. కాకపోతే ఈసారి వీళ్ల రోల్స్ మాత్రం రివర్స్ అవుతున్నాయి. మోహన్ లాల్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘బారోజ్’లో ఒక కీలక పాత్ర చేయబోతున్నాడు పృథ్వి. ఇప్పటి వరకు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆనందపడినవాడు, ఇప్పుడు ఆయన తనను డైరెక్ట్ చేస్తున్నందుకు ఆనందంతో పొంగిపోతున్నాడు. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఇగోకి తావులేని ఇంత మంచి బాండింగ్ ఉండటం కాస్త అరుదనే చెప్పాలి.
This post was last modified on December 29, 2021 7:17 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…