ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ బాగా క్లిక్ అవుతుంటాయి. అది హీరో హీరోయిన్లు కావొచ్చు.. దర్శకుడు నిర్మాత కావచ్చు.. హీరో దర్శకుడూ కూడా అయ్యుండొచ్చు. ఈ మూడో కేటగిరీకి చెందినవారే మలయాళ హీరోలు మోహన్లాల్, పృథ్విరాజ్ సుకుమారన్. వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబో అనడంలో సందేహమే లేదు.
ఓ సినిమా తీసి, అది సక్సెస్ అయితే మళ్లీ మళ్లీ పని చేసేవారు ఉంటారు. కానీ వీళ్ల రూటే వేరు. పృథ్విరాజ్కి మోహన్లాల్ అంటే వల్లమాలిన అభిమానం, ఆరాధన. ఓ స్టార్ హీరో అయ్యుండి కూడా ఏమాత్రం ఇగో లేకుండా లాల్కి వీరాభిమానిని అని చెప్పుకుంటాడు. ఆ అభిమానంతోనే లూసిఫర్ సినిమా తీశాడు. అందులో మోహన్లాల్ ఎలివేషన్లు అదిరిపోవడానికి కారణం ఆయనపై పృథ్విరాజ్కి ఉన్న ఇష్టమే. తన ఫేవరేట్ హీరోని అలా చూపించేందుకే ఆ సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇప్పుడు మరోసారి ఆయనతో బ్రోడాడీ అనే సినిమా తీస్తున్నాడు పృథ్వి. పేరుతోనే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సినిమాని నలభై నాలుగు రోజుల్లోనే షూట్ చేసేశాడు. మొత్తం హైదరాబాద్లోనే తీశాడు. ఆంటోనీ పెరంబవూర్తో కలిసి నిర్మిస్తున్నాడు కూడా. లూసిఫర్లో చిన్న పాత్రలో కనిపించినవాడు ఈ సినిమాలో లాల్తో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. జనవరి 26న మూవీ హాట్స్టార్లో రిలీజ్ కానుంది. ఇవాళ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. సూటూ బూటూ వేసుకుని యమా స్టైలిష్గా, రిచ్ లుక్లో ఉన్నారిద్దరూ. చూసినవాళ్లంతా హిట్ పెయిర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే ఈ హిట్ పెయిర్ మరోసారి కూడా రిపీట్ కానుంది. మరో మూవీకి కూడా ఇద్దరూ కలిసి పని చేయబోతున్నారు. కాకపోతే ఈసారి వీళ్ల రోల్స్ మాత్రం రివర్స్ అవుతున్నాయి. మోహన్ లాల్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘బారోజ్’లో ఒక కీలక పాత్ర చేయబోతున్నాడు పృథ్వి. ఇప్పటి వరకు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆనందపడినవాడు, ఇప్పుడు ఆయన తనను డైరెక్ట్ చేస్తున్నందుకు ఆనందంతో పొంగిపోతున్నాడు. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఇగోకి తావులేని ఇంత మంచి బాండింగ్ ఉండటం కాస్త అరుదనే చెప్పాలి.
This post was last modified on December 29, 2021 7:17 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…