ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ బాగా క్లిక్ అవుతుంటాయి. అది హీరో హీరోయిన్లు కావొచ్చు.. దర్శకుడు నిర్మాత కావచ్చు.. హీరో దర్శకుడూ కూడా అయ్యుండొచ్చు. ఈ మూడో కేటగిరీకి చెందినవారే మలయాళ హీరోలు మోహన్లాల్, పృథ్విరాజ్ సుకుమారన్. వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబో అనడంలో సందేహమే లేదు.
ఓ సినిమా తీసి, అది సక్సెస్ అయితే మళ్లీ మళ్లీ పని చేసేవారు ఉంటారు. కానీ వీళ్ల రూటే వేరు. పృథ్విరాజ్కి మోహన్లాల్ అంటే వల్లమాలిన అభిమానం, ఆరాధన. ఓ స్టార్ హీరో అయ్యుండి కూడా ఏమాత్రం ఇగో లేకుండా లాల్కి వీరాభిమానిని అని చెప్పుకుంటాడు. ఆ అభిమానంతోనే లూసిఫర్ సినిమా తీశాడు. అందులో మోహన్లాల్ ఎలివేషన్లు అదిరిపోవడానికి కారణం ఆయనపై పృథ్విరాజ్కి ఉన్న ఇష్టమే. తన ఫేవరేట్ హీరోని అలా చూపించేందుకే ఆ సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇప్పుడు మరోసారి ఆయనతో బ్రోడాడీ అనే సినిమా తీస్తున్నాడు పృథ్వి. పేరుతోనే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సినిమాని నలభై నాలుగు రోజుల్లోనే షూట్ చేసేశాడు. మొత్తం హైదరాబాద్లోనే తీశాడు. ఆంటోనీ పెరంబవూర్తో కలిసి నిర్మిస్తున్నాడు కూడా. లూసిఫర్లో చిన్న పాత్రలో కనిపించినవాడు ఈ సినిమాలో లాల్తో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. జనవరి 26న మూవీ హాట్స్టార్లో రిలీజ్ కానుంది. ఇవాళ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. సూటూ బూటూ వేసుకుని యమా స్టైలిష్గా, రిచ్ లుక్లో ఉన్నారిద్దరూ. చూసినవాళ్లంతా హిట్ పెయిర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే ఈ హిట్ పెయిర్ మరోసారి కూడా రిపీట్ కానుంది. మరో మూవీకి కూడా ఇద్దరూ కలిసి పని చేయబోతున్నారు. కాకపోతే ఈసారి వీళ్ల రోల్స్ మాత్రం రివర్స్ అవుతున్నాయి. మోహన్ లాల్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘బారోజ్’లో ఒక కీలక పాత్ర చేయబోతున్నాడు పృథ్వి. ఇప్పటి వరకు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆనందపడినవాడు, ఇప్పుడు ఆయన తనను డైరెక్ట్ చేస్తున్నందుకు ఆనందంతో పొంగిపోతున్నాడు. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఇగోకి తావులేని ఇంత మంచి బాండింగ్ ఉండటం కాస్త అరుదనే చెప్పాలి.
This post was last modified on December 29, 2021 7:17 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…