ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది ఆర్ఆర్ఆర్ సినిమా. తొలిసారి వాయిదా వేయడానికి చిత్ర బృందం ఆలస్యమే కారణం. కానీ తర్వాతి రెండుసార్లూ కరోనా కారణంగానే సినిమా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఐతే అన్ని అడ్డంకులనూ దాటి ఎట్టకేలకు 2022 జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఆ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ కరోనా సినిమాలను దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. ఢిల్లీలో థియేటర్లు మూసేయడం.. ఉత్తరాదిన మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ బాట పట్టే సూచనలు కనిపిస్తుండటంతో ఇప్పటికే జెర్సీ మూవీని వాయిదా వేశారు. ఇక తర్వాతి వంతు ఆర్ఆర్ఆర్దే అన్న ఊహాగానాలు మొదలైపోయాయి. కానీ ఈ దశలో ఈ చిత్రాన్ని వాయిదా వేయడం కష్టమే అని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీకి నెల రోజుల నుంచి ఉద్దృతంగా ప్రమోషన్లు చేస్తున్నారు. చాలా ఖర్చు పెట్టి ఈవెంట్లు చేశారు. దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందుకోసం చాలా కష్టపడ్డారు. మరోవైపు ఇండియాలోనే కాక వరల్డ్ వైడ్ థియేటర్లతో ఒప్పందాలు జరిగిపోయాయి. ఓవర్సీస్లో పది రోజుల కిందట్నుంచే టికెట్లు అమ్ముతున్నారు. పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడయ్యాయి కూడా. ఇంతా జరిగాక ఇప్పుడు సినిమా వాయిదా అంటే అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి. ఇండియాలో అయినా కూడా ఇబ్బందే.
ఈ అనిశ్చితి ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఎంతో కష్టపడి పోటీగా ఉన్న సినిమాలను తప్పించి, విమర్శలు కూడా ఎదుర్కొని సినిమాను విడుదలకు సిద్ధం చేశాక, ప్రమోషన్లు సహా అన్ని విషయాల్లో ఎంతో కష్టపడ్డాక ఇప్పుడు వాయిదా అంటే ఎంత కష్టమో అంచనా వేయొచ్చు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎంచుకోవడంలోనూ చాలా ఇబ్బందులున్నాయి. వాయిదా వల్ల వడ్డీల భారమూ పెరుగుతుంది. కాబట్టి కొన్ని ఏరియాల్లో వసూళ్ల పరంగా కొంత కోత పడ్డా పర్వాలేదని జనవరి 7న రిలీజ్కు వెళ్లిపోయే ఆలోచనతోనే చిత్ర బృందం ఉందట. మరీ పరిస్థితి విషమిస్తే తప్ప ఈ చిత్రాన్ని వాయిదా వేయడం డౌటే అంటున్నారు.
This post was last modified on December 29, 2021 12:53 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…