ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను ఒమిక్రాన్ అంటూ మరో వేరియంట్ వెంటాడుతోంది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. అలానే మరికొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్, కరీనా కపూర్ లాంటి స్టార్లకు కోవిదు సోకింది. రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నప్పటికీ వారికి కోవిడ్ సోకడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డారు.
ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు ఒమిక్రాన్ సోకిందేమోనని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లాస్ట్ వీక్ లో తనను కలిసివారిని వెంటనే టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు.
తన గురించి ఆందోళన చెందొద్దని.. డాక్టర్స్, నర్స్ ల కేర్ లో ఉన్నట్లు చెప్పారు. ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మంచు మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన చివరిగా హీరోగా నటించిన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. ఆ తరువాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా కాలమవుతున్నా.. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.
This post was last modified on December 29, 2021 11:21 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…