ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల సమస్య ఫిలిం ఇండస్ట్రీని మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు. కానీ ఈ విషయంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అయినా సరే.. ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి ధైర్యం చాలక చాలామంది మౌనం వహిస్తున్నారు. ఇలాంటి టైంలో యువ కథానాయకుడు నాని ఏపీ ప్రభుత్వ తీరుపై కాస్త గట్టిగానే విమర్శలు గుప్పించాడు.
ఏపీలో జరుగుతున్నది కరెక్ట్ కాదని, థియేటర్లలో కౌంటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టుల్లో కౌంటర్ మెరుగ్గా ఉంటోందని వ్యాఖ్యానించాడు. టికెట్ల రేట్లను తగ్గించడం ప్రేక్షకులకు అవమానకరం అని కూడా అతనన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నాని ఎవరో తెలియదంటూ అతడి గాలి తీసే ప్రయత్నం చేశాడు. ఇంకా ఏవో విమర్శలు కూడా చేశారు.
ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన మరో మంత్రి కొడాలి నాని లైన్లోకి వచ్చారు. థియేటర్ల కౌంటర్ కంటే కిరాణా కొట్టుల్లో కౌంటర్ బాగుందంటూ నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కిరాణా కొట్టుల్లోనే మెరుగైన ఆదాయం ఉందనుకుంటే సినిమా వాళ్లంతా వాటిలోనే పెట్టుబడులు పెట్టాలని, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకని ఆయన కౌంటర్ వేశారు. సినిమా టికెట్ల రేట్లను తాము తగ్గించలేదని, గతంలో ఉన్న రేట్లే ఉన్నాయని ఆయనన్నారు.
కొన్ని సినిమాల వరకు రేట్లు పెంచుకునేందుకు కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకునేవారని, ఆ పరిస్థితి ఉండకూడదనే తాము జీవో నంబర్ 35ను తీసుకొచ్చామని అన్నారు.కోర్టుల అనుమతితో ప్రేక్షకులను కొందరు దోచుకునే అవకాశం ఇవ్వకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, టికెట్ల ధరలు తగ్గిస్తే ఎగ్జిబిటర్లకు నష్టమని అంటున్నారని, ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని నాని విమర్శించారు.
This post was last modified on December 28, 2021 7:29 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…