ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల సమస్య ఫిలిం ఇండస్ట్రీని మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు. కానీ ఈ విషయంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అయినా సరే.. ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి ధైర్యం చాలక చాలామంది మౌనం వహిస్తున్నారు. ఇలాంటి టైంలో యువ కథానాయకుడు నాని ఏపీ ప్రభుత్వ తీరుపై కాస్త గట్టిగానే విమర్శలు గుప్పించాడు.
ఏపీలో జరుగుతున్నది కరెక్ట్ కాదని, థియేటర్లలో కౌంటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టుల్లో కౌంటర్ మెరుగ్గా ఉంటోందని వ్యాఖ్యానించాడు. టికెట్ల రేట్లను తగ్గించడం ప్రేక్షకులకు అవమానకరం అని కూడా అతనన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నాని ఎవరో తెలియదంటూ అతడి గాలి తీసే ప్రయత్నం చేశాడు. ఇంకా ఏవో విమర్శలు కూడా చేశారు.
ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన మరో మంత్రి కొడాలి నాని లైన్లోకి వచ్చారు. థియేటర్ల కౌంటర్ కంటే కిరాణా కొట్టుల్లో కౌంటర్ బాగుందంటూ నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కిరాణా కొట్టుల్లోనే మెరుగైన ఆదాయం ఉందనుకుంటే సినిమా వాళ్లంతా వాటిలోనే పెట్టుబడులు పెట్టాలని, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకని ఆయన కౌంటర్ వేశారు. సినిమా టికెట్ల రేట్లను తాము తగ్గించలేదని, గతంలో ఉన్న రేట్లే ఉన్నాయని ఆయనన్నారు.
కొన్ని సినిమాల వరకు రేట్లు పెంచుకునేందుకు కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకునేవారని, ఆ పరిస్థితి ఉండకూడదనే తాము జీవో నంబర్ 35ను తీసుకొచ్చామని అన్నారు.కోర్టుల అనుమతితో ప్రేక్షకులను కొందరు దోచుకునే అవకాశం ఇవ్వకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, టికెట్ల ధరలు తగ్గిస్తే ఎగ్జిబిటర్లకు నష్టమని అంటున్నారని, ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని నాని విమర్శించారు.
This post was last modified on December 28, 2021 7:29 pm
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా…
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు శ్రీ విష్ణు. గత ఏడాది అతడి నుంచి…