నేచురల్ స్టార్ నాని కెరీర్లో కీలకమైన చిత్రంగా ‘శ్యామ్ సింగ రాయ్’ను చెప్పొచ్చు. ఈ సినిమాకు ముందు నాని చేసిన రెండు చిత్రాలు టక్ జగదీష్, వి అన్ని రకాలుగా నిరాశ పరిచాయి. అవి థియేటర్లలోకి రాకపోవడం నాని అభిమానులకు అస్సలు రుచించలేదు. పైగా వాటికి సరైన టాక్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడమే కాక, ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత నానిపై పడింది.
ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’పై అందరి దృష్టీ నిలిచింది. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది. అనేక అడ్డంకుల్ని అధిగమించి ఈ చిత్రం ఇటీవలే క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి దిగింది. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. చిత్ర బృందం టెన్షన్ తీరిపోయేలా పాజిటివ్ టాకే వచ్చింది. అలాగే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి.
నాని బాక్సాఫీస్ స్టామినాను ‘శ్యామ్ సింగ రాయ్’ రుజువు చేసింది. మూడు రోజుల తొలి వీకెండ్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.24 కోట్ల దాకా గ్రాస్, రూ.14 కోట్ల మేర షేర్ రాబట్టింది. నైజాంలో ఈ సినిమా బాగా పెర్ఫామ్ చేసింది. ఇక్కడ రూ.8.5 కోట్ల గ్రాస్, దాదాపు 5 కోట్ల షేర్ వచ్చిందీ చిత్రానికి. సీడెడ్లో కోటిన్నర దాకా షేర్ కలెక్ట్ చేసింది నాని సినిమా. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.4 కోట్ల పైచిలుకు షేర్ వచ్చింది.
ఓవరాల్గా ఏపీ, తెలంగాణ కలిపి పదిన్నర కోట్ల దాకా షేర్, రూ.16 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ అయింది. యుఎస్లో ఈ చిత్రం వీకెండ్లో హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది. ఓవరాల్గా సినిమా తొలి వీకెండ్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.20 కోట్లకు అమ్మినట్లు అంచనా. వీక్ డేస్లో కొంచెం వీక్ అయినప్పటికీ.. వీకెండ్లో మళ్లీ పుంజుకుంటుందని అంచనా. కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులున్నట్లే.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…