తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్లో అడుగు పెట్టినప్పటి నుంచి టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్నాడు షన్ను. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లతో మాంచి ఫాలోయింగ్, పాపులారిటీ సంపాదించుకుని ఈ షోలో అడుగు పెట్టిన అతను.. కచ్చితంగా టైటిల్ సాధిస్తాడని చాలామంది నమ్మారు. ఐతే షో మధ్యలో సిరితో అతడి బంధం పట్ల జనాలకు నెగెటివ్ ఫీలింగ్స్ కలగడం, ఒక దశ దాటాక వీరి రిలేషన్ మరీ శ్రుతి మించిపోవడంతో అతను ట్రాక్ తప్పాడు.
టైటిల్ గెలవాల్సిన వాడు చివర్లో నెగెటివిటీ పెంచుకుని రన్నరప్కు పరిమితం అయ్యాడు. షన్ను, సిరి రిలేషన్ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. నిజజీవితంలో వీళ్లిద్దరూ ఆల్రెడీ ఎంగేడ్జ్ అన్న సంగతి తెలిసిందే. షన్నుకు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కమ్ యూట్యూబ్ స్టార్ దీప్తికి మధ్య బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
షోలో జరిగిన దాని పట్ల బయటి జనాలు ఎన్ని అనుకున్నా.. దీప్తి షన్ను విషయంలో ఎలా స్పందిస్తుందనే విషయంలో అందరూ ఉత్కంఠకు గురయ్యారు. ఇటీవల ఆమె సోషల్ మీడియా పోస్టులు చూస్తే షన్నుతో బ్రేకప్ అయిందేమో అన్న సందేహాలు కలిగాయి. ఈ విషయమై తాజాగా షన్ను స్పందించాడు. అభిమానులతో లైవ్ సందర్భంగా చాలామంది షన్నును దీప్తితో బ్రేకప్ గురించే అడిగారు. దానికతను బదులిస్తూ.. దీప్తి తనను బ్లాక్ చేసిందని వెల్లడించాడు.
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి దీప్తి తనతో మాట్లాడట్లేదని వెల్లడించాడు. దీప్తికి కోపం వచ్చినా.. అలిగినా ఇలాగే బ్లాక్ చేస్తుందని.. త్వరలోనే హైద్రాబాద్ వెళ్లి తనను కలుస్తానని చెప్పుకొచ్చాడు షన్ను. దీప్తి తన వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసిందని.. అయినా తన కోసం నిలబడిందని.. తప్పకుండా వెళ్లి తనతో మాట్లాడతానని.. తనతో బ్రేకప్ మాత్రం జరగదని.. తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీప్తిని వదలనని చెప్పాడు షణ్ముఖ్.
This post was last modified on December 27, 2021 12:48 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…