Movie News

సన్నీ లియోన్ పాటకు మంత్రి వార్నింగ్

ప్రతి అంశం సున్నితంగా మారిపోయిన ఇప్పటి రోజుల్లో ప్రతిది ఆచితూచి అన్నట్లు వ్యవహరించాల్సి ఉంది. అయినప్పటికి తరచూ ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తోంది. తాజాగా ఒకప్పటి అడల్ట్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా చేసిన వీడియో ఒకటి పెను వివాదంగా మారటం తెలిసిందే. హిందువుల మనోభావాల్ని దారుణంగా దెబ్బ తీసేలా ఈ పాట ఉందన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ‘మధుబన్ మే రాధిక నాచే’ పేరుతో విడుదలైన ఈ హందీ వీడియో సాంగ్ పై  పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావటంతో పాటు.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను విడుదల చేశారని మండిపడుతున్నారు.

డిసెంబరు 22న విడుదలైన ఈ పాటపై ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు ఆర్బకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి.. బీజేపీనేత సరోత్తమ మిశ్రా స్పందించారు. మూడు రోజుల వ్యవధిలో ఈ పాటను తీసేయకుంటే.. తాము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ పాటను పాడిన సింగర్స్ ను.. డ్యాన్స్ చేసిన సన్నీలియోన్ తో పాటు.. పాటను ప్రొడ్యూస్ చేసిన సంస్థకు తాజాగా హెచ్చరికల్ని ఆయన చేశారు.

ఇంతకీ ఈ పాట బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇదెందుకు వివాదమైంది? అన్న విషయంలోకి వెళితే.. 1960లో వచ్చిన కోహినూర్ చిత్రంలో ‘మధుబన్ మే రాధిక నాచ్ రే’ పాటలోని పల్లవిని ఈ పాట పోలిఉంటుంది. అప్పట్లో ఆ పాటను ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ పాడగా.. దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. తాజాగా ఇదే పాటను రీమేక్ లో షరీబ్.. తోషిలు పాడగా.. సన్నీ లియోన్ ఆడారు. ఈ వివాదంలో ఈ ముగ్గురు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. మూడు రోజుల వ్యవధిలో ఈ వీడియోను తొలగించకుంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ వార్నింగ్ నేపథ్యంలో ఈ పాటను విడుదల చేసిన ‘సరిగమప’ మ్యూజిక్ సంస్థ.. పాటను మార్చాలని నిర్ణయించింది.

ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. మార్పు చేసిన లిరిక్స్ తో పాటు.. పాట పేరును కూడా మారుస్తామన్నారు. మూడు రోజుల్లో అన్ని వేదికల్లోనూ మార్పు చేసిన పాట అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక.. వార్నింగ్ ఇచ్చిన నరోత్తమ విషయానికి వస్తే.. గతంలోనూ ఆయనో జ్యువెలరీ సంస్థకు హెచ్చరిక చేశారు. మంగళసూత్రాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటనను రూపొందించారు. ఆయన హెచ్చరిక అనంతరం ఆ యాడ్ ను ఉపసంహరించుకున్నారు. ఏమైనా.. పాటలు కానీ.. ప్రకటనలు కానీ రూపొందించే వేళలోనే అందరి మనోభావాల గురించి ఆలోచించటం పెద్ద సవాలుగా మారుతుందని చెప్పక తప్పదు.

This post was last modified on December 27, 2021 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

38 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

44 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago