ప్రతి అంశం సున్నితంగా మారిపోయిన ఇప్పటి రోజుల్లో ప్రతిది ఆచితూచి అన్నట్లు వ్యవహరించాల్సి ఉంది. అయినప్పటికి తరచూ ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తోంది. తాజాగా ఒకప్పటి అడల్ట్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా చేసిన వీడియో ఒకటి పెను వివాదంగా మారటం తెలిసిందే. హిందువుల మనోభావాల్ని దారుణంగా దెబ్బ తీసేలా ఈ పాట ఉందన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ‘మధుబన్ మే రాధిక నాచే’ పేరుతో విడుదలైన ఈ హందీ వీడియో సాంగ్ పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావటంతో పాటు.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను విడుదల చేశారని మండిపడుతున్నారు.
డిసెంబరు 22న విడుదలైన ఈ పాటపై ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు ఆర్బకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి.. బీజేపీనేత సరోత్తమ మిశ్రా స్పందించారు. మూడు రోజుల వ్యవధిలో ఈ పాటను తీసేయకుంటే.. తాము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ పాటను పాడిన సింగర్స్ ను.. డ్యాన్స్ చేసిన సన్నీలియోన్ తో పాటు.. పాటను ప్రొడ్యూస్ చేసిన సంస్థకు తాజాగా హెచ్చరికల్ని ఆయన చేశారు.
ఇంతకీ ఈ పాట బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇదెందుకు వివాదమైంది? అన్న విషయంలోకి వెళితే.. 1960లో వచ్చిన కోహినూర్ చిత్రంలో ‘మధుబన్ మే రాధిక నాచ్ రే’ పాటలోని పల్లవిని ఈ పాట పోలిఉంటుంది. అప్పట్లో ఆ పాటను ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ పాడగా.. దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. తాజాగా ఇదే పాటను రీమేక్ లో షరీబ్.. తోషిలు పాడగా.. సన్నీ లియోన్ ఆడారు. ఈ వివాదంలో ఈ ముగ్గురు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. మూడు రోజుల వ్యవధిలో ఈ వీడియోను తొలగించకుంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ వార్నింగ్ నేపథ్యంలో ఈ పాటను విడుదల చేసిన ‘సరిగమప’ మ్యూజిక్ సంస్థ.. పాటను మార్చాలని నిర్ణయించింది.
ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. మార్పు చేసిన లిరిక్స్ తో పాటు.. పాట పేరును కూడా మారుస్తామన్నారు. మూడు రోజుల్లో అన్ని వేదికల్లోనూ మార్పు చేసిన పాట అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక.. వార్నింగ్ ఇచ్చిన నరోత్తమ విషయానికి వస్తే.. గతంలోనూ ఆయనో జ్యువెలరీ సంస్థకు హెచ్చరిక చేశారు. మంగళసూత్రాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటనను రూపొందించారు. ఆయన హెచ్చరిక అనంతరం ఆ యాడ్ ను ఉపసంహరించుకున్నారు. ఏమైనా.. పాటలు కానీ.. ప్రకటనలు కానీ రూపొందించే వేళలోనే అందరి మనోభావాల గురించి ఆలోచించటం పెద్ద సవాలుగా మారుతుందని చెప్పక తప్పదు.
This post was last modified on December 27, 2021 11:39 am
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…
దాయాది దేశం పాకిస్థాన్కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్…