ప్రతి అంశం సున్నితంగా మారిపోయిన ఇప్పటి రోజుల్లో ప్రతిది ఆచితూచి అన్నట్లు వ్యవహరించాల్సి ఉంది. అయినప్పటికి తరచూ ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తోంది. తాజాగా ఒకప్పటి అడల్ట్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా చేసిన వీడియో ఒకటి పెను వివాదంగా మారటం తెలిసిందే. హిందువుల మనోభావాల్ని దారుణంగా దెబ్బ తీసేలా ఈ పాట ఉందన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ‘మధుబన్ మే రాధిక నాచే’ పేరుతో విడుదలైన ఈ హందీ వీడియో సాంగ్ పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావటంతో పాటు.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను విడుదల చేశారని మండిపడుతున్నారు.
డిసెంబరు 22న విడుదలైన ఈ పాటపై ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు ఆర్బకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి.. బీజేపీనేత సరోత్తమ మిశ్రా స్పందించారు. మూడు రోజుల వ్యవధిలో ఈ పాటను తీసేయకుంటే.. తాము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ పాటను పాడిన సింగర్స్ ను.. డ్యాన్స్ చేసిన సన్నీలియోన్ తో పాటు.. పాటను ప్రొడ్యూస్ చేసిన సంస్థకు తాజాగా హెచ్చరికల్ని ఆయన చేశారు.
ఇంతకీ ఈ పాట బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇదెందుకు వివాదమైంది? అన్న విషయంలోకి వెళితే.. 1960లో వచ్చిన కోహినూర్ చిత్రంలో ‘మధుబన్ మే రాధిక నాచ్ రే’ పాటలోని పల్లవిని ఈ పాట పోలిఉంటుంది. అప్పట్లో ఆ పాటను ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ పాడగా.. దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. తాజాగా ఇదే పాటను రీమేక్ లో షరీబ్.. తోషిలు పాడగా.. సన్నీ లియోన్ ఆడారు. ఈ వివాదంలో ఈ ముగ్గురు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. మూడు రోజుల వ్యవధిలో ఈ వీడియోను తొలగించకుంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ వార్నింగ్ నేపథ్యంలో ఈ పాటను విడుదల చేసిన ‘సరిగమప’ మ్యూజిక్ సంస్థ.. పాటను మార్చాలని నిర్ణయించింది.
ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. మార్పు చేసిన లిరిక్స్ తో పాటు.. పాట పేరును కూడా మారుస్తామన్నారు. మూడు రోజుల్లో అన్ని వేదికల్లోనూ మార్పు చేసిన పాట అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక.. వార్నింగ్ ఇచ్చిన నరోత్తమ విషయానికి వస్తే.. గతంలోనూ ఆయనో జ్యువెలరీ సంస్థకు హెచ్చరిక చేశారు. మంగళసూత్రాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటనను రూపొందించారు. ఆయన హెచ్చరిక అనంతరం ఆ యాడ్ ను ఉపసంహరించుకున్నారు. ఏమైనా.. పాటలు కానీ.. ప్రకటనలు కానీ రూపొందించే వేళలోనే అందరి మనోభావాల గురించి ఆలోచించటం పెద్ద సవాలుగా మారుతుందని చెప్పక తప్పదు.
This post was last modified on December 27, 2021 11:39 am
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…