Movie News

సన్నీ లియోన్ పాటకు మంత్రి వార్నింగ్

ప్రతి అంశం సున్నితంగా మారిపోయిన ఇప్పటి రోజుల్లో ప్రతిది ఆచితూచి అన్నట్లు వ్యవహరించాల్సి ఉంది. అయినప్పటికి తరచూ ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తోంది. తాజాగా ఒకప్పటి అడల్ట్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా చేసిన వీడియో ఒకటి పెను వివాదంగా మారటం తెలిసిందే. హిందువుల మనోభావాల్ని దారుణంగా దెబ్బ తీసేలా ఈ పాట ఉందన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ‘మధుబన్ మే రాధిక నాచే’ పేరుతో విడుదలైన ఈ హందీ వీడియో సాంగ్ పై  పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావటంతో పాటు.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను విడుదల చేశారని మండిపడుతున్నారు.

డిసెంబరు 22న విడుదలైన ఈ పాటపై ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు ఆర్బకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి.. బీజేపీనేత సరోత్తమ మిశ్రా స్పందించారు. మూడు రోజుల వ్యవధిలో ఈ పాటను తీసేయకుంటే.. తాము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ పాటను పాడిన సింగర్స్ ను.. డ్యాన్స్ చేసిన సన్నీలియోన్ తో పాటు.. పాటను ప్రొడ్యూస్ చేసిన సంస్థకు తాజాగా హెచ్చరికల్ని ఆయన చేశారు.

ఇంతకీ ఈ పాట బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇదెందుకు వివాదమైంది? అన్న విషయంలోకి వెళితే.. 1960లో వచ్చిన కోహినూర్ చిత్రంలో ‘మధుబన్ మే రాధిక నాచ్ రే’ పాటలోని పల్లవిని ఈ పాట పోలిఉంటుంది. అప్పట్లో ఆ పాటను ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ పాడగా.. దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. తాజాగా ఇదే పాటను రీమేక్ లో షరీబ్.. తోషిలు పాడగా.. సన్నీ లియోన్ ఆడారు. ఈ వివాదంలో ఈ ముగ్గురు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. మూడు రోజుల వ్యవధిలో ఈ వీడియోను తొలగించకుంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ వార్నింగ్ నేపథ్యంలో ఈ పాటను విడుదల చేసిన ‘సరిగమప’ మ్యూజిక్ సంస్థ.. పాటను మార్చాలని నిర్ణయించింది.

ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. మార్పు చేసిన లిరిక్స్ తో పాటు.. పాట పేరును కూడా మారుస్తామన్నారు. మూడు రోజుల్లో అన్ని వేదికల్లోనూ మార్పు చేసిన పాట అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక.. వార్నింగ్ ఇచ్చిన నరోత్తమ విషయానికి వస్తే.. గతంలోనూ ఆయనో జ్యువెలరీ సంస్థకు హెచ్చరిక చేశారు. మంగళసూత్రాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటనను రూపొందించారు. ఆయన హెచ్చరిక అనంతరం ఆ యాడ్ ను ఉపసంహరించుకున్నారు. ఏమైనా.. పాటలు కానీ.. ప్రకటనలు కానీ రూపొందించే వేళలోనే అందరి మనోభావాల గురించి ఆలోచించటం పెద్ద సవాలుగా మారుతుందని చెప్పక తప్పదు.

This post was last modified on December 27, 2021 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

4 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

4 hours ago

మందుబాబులకు షాకిచ్చిన విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…

4 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

5 hours ago