టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మొదటినుంచి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు వేరే సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తుంటాడు. ‘ఓ బేబీ’ సినిమా ఇదే కోవలోకి వస్తుంది. అందులో సమంత మెయిన్ లీడ్ కాగా.. నాగశౌర్య ఆమెని ప్రేమించే పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు అలాంటి ఆఫరే శౌర్యకి మరొకటి వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి జంటగా కనిపించే రోల్ అని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ‘భోళాశంకర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఆమెకి జోడీగా నాగశౌర్యను తీసుకోవాలని భావిస్తున్నారు. రీసెంట్ గానే అతడితో సంప్రదింపులు జరిపారు. కానీ ఇప్పటివరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి శౌర్య నో చెప్పే అవకాశాలు లేవనే చెప్పాలి. చిరు సినిమా.. కీర్తి సురేష్ కి జోడీగా అంటే కచ్చితంగా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. వీటితో పాటు ‘సినిమా బండి’ డైరెక్టర్ తో మరో సినిమా ఓకే చేసినట్లు సమాచారం. మొత్తానికి ఈ యంగ్ హీరో వచ్చే ఏడాది మొత్తం బిజీ బిజీగా గడపనున్నారన్నమాట!
This post was last modified on December 26, 2021 6:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…