సినిమాల లైనప్ పెద్దగానే ఉన్నా సరైన హిట్టు మాత్రం ఖాతాలో పడటం లేదు నాగశౌర్యకి. ఈ యేడు ఆల్రెడీ వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నెక్స్ట్ సినిమాలపైనే హోప్స్ పెట్టుకున్నాడు.
ప్రస్తుతం శౌర్య చేతిలో మూడు సినిమాలున్నాయి. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చేస్తున్నాడు. రాజేంద్ర డైరెక్షన్లో ‘పోలీసువారి హెచ్చరిక’ అనే మరో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అలాగే అనీష్ కృష్ణతో తమ సొంత బ్యానర్లోనే ఓ సినిమా రెడీ అవుతోంది. వీటితో పాటు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్కి కూడా కమిటైనట్టు తెలుస్తోంది.
‘ద ఫ్యామిలీ మేన్’ సిరీస్తో నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన రాజ్ నిడమోరు, డీకే కృష్ణలతో ఓ సినిమా చేయబోతున్నాడట నాగశౌర్య. అయితే దీన్ని వాళ్లు డైరెక్ట్ చేయరట. కేవలం నిర్మిస్తారట. గతంలోనూ వారు డీ ఫర్ దోపిడీ, సినిమా బండి లాంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు శౌర్యతో సినిమా ప్లాన్ చేశారట. ‘సినిమా బండి’ తీసిన ప్రవీణ్ కాండ్రేగులకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
అదే కనుక నిజమైతే ఇది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి. రాజ్, డీకేలు మేకింగ్ టెక్నిక్స్, మార్కెట్ వేల్యూస్ తెలిసినవాళ్లు. ఏ ప్రాజెక్ట్ చేసినా ఫుల్ క్లారిటీతో ఉంటారు ఇక ప్రవీణ్ ‘సినిమాబండి’ని అద్భుతంగా తెరకెక్కించి బోలెడన్ని ప్రశంసలు అందుకున్నాడు. వీళ్లు మరోసారి కలుస్తున్నారంటే ఓ మంచి మూవీని ఆశించవచ్చు. కాబట్టి వారితో పని చేయడం శౌర్యకి కచ్చితంగా ప్లస్ అవుతుంది.
This post was last modified on December 25, 2021 5:44 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…