ఈ ఏడాది తెలుగులో విడుదలైన బిగ్గెస్ట్ మూవీ అంటే.. పుష్పనే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను దాదాపు రూ.150 కోట్లకు అమ్మారు. గత వారం విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా తొలి వారాంతంలో వసూళ్ల మోత మోగించింది. తొలి మూడు రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సినిమా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. పుష్ప అప్పుడే రెండో వారంలోకి కూడా అడుగు పెట్టేసింది.
ఈ నేపథ్యంలో తొలి వారం వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పుష్ప ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ 100 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. ఏడు రోజుల్లో అన్ని వెర్షన్లూ కలిపి దాదాపు రూ.110 కోట్ల దాకా షేర్ రాబట్టాయి. అందులో మేజర్ షేర్ తెలుగు వెర్షన్దే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ.67 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఇందులో నైజాందే మేజర్ వాటా. ఇక్కడ దాదాపు రూ.32 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది పుష్ప.
ఇంకో నాలుగు కోట్లొస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ వీకెండ్ అయ్యేసరికి ఆ మార్కును అందుకోవచ్చు. సీడెడ్లో పుష్ప బిజినెస్ రూ.18 కోట్లు కాగా.. ఇప్పటికి రూ.11 కోట్ల షేర్ వచ్చింది. అక్కడ అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్కు చేరువగా వెళ్లొచ్చు. ఆంధ్రాల్లో రూ.48 కోట్లకు బిజినెస్ జరిగితే ఇప్పటిదాకా వచ్చిన షేర్ రూ.24 కోట్ల లోపే. ఆంధ్రాలో భారీ నష్టాలు తప్పేలా లేవు.
పుష్ప తమిళ వెర్షన్ రూ.6 కోట్లు, మలయాళ వెర్షన్ రూ.4 కోట్లు షేర్ రాబట్టి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయాయి. రెండో వారంలో వచ్చేదంతా లాభమే. హిందీ వెర్షన్ దాదాపు రూ.14 కోట్ల షేర్ రాబట్టి ఆల్రెడీ 3 కోట్ల లాభంలో ఉంది. ఓవర్సీస్ రైట్స్ రూ.13 కోట్లకు అమ్మగా.. ఇప్పటికే ఈ చిత్రం 2 మిలియన్ మార్కును దాటేసి బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్గా తొలి వారం షేర్ రూ.110 కోట్లకు చేరువగా.. గ్రాస్ కలెక్షన్లు రూ.200 కోట్ల మార్కుకు దగ్గరగా ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో రూ.40 కోట్ల షేర్ రాబట్టాలి.
This post was last modified on December 25, 2021 8:06 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…