ఓవైపు తన పొలిటికల్ కెరీర్తో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిటవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ ‘భీమ్లానాయక్’ రిలీజ్కి రెడీ అయ్యింది. ‘హరిహర వీరమల్లు’ త్వరలోనే తిరిగి సెట్స్కి వెళ్లబోతోంది. హరీష్ శంకర్ సినిమా లైన్లో ఉంది. ఇంతలో మరికొన్ని సినిమాలకు పీకే కమిటయ్యే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ‘రిపబ్లిక్’ సీక్వెల్ ఒకటి.
సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్ట తీసిన ఈ సినిమా బ్యూరోక్రసీపై పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని కళ్లకు కట్టింది. సీరియస్ కాన్సెప్ట్ని సిన్సియర్గా తీసి మెప్పించాడు దేవా. ఐఏఎస్ ఆఫీసర్గా తేజ్ నటనకు కూడా ఫుల్ మార్కులు పడ్డాయి. కమర్షియల్గా అంత కలిసి రాకపోయినా, మంచి సినిమా అనే ముద్ర అయితే వేయించుకుంది రిపబ్లిక్. అందుకే దీనికి సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దేవా.
అయితే ఈసారి తేజ్ కాదు.. పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి దేవాకి పవన్తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. రిపబ్లిక్ని కూడా పవన్ని దృష్టిలో పెట్టుకునే రాశాడట. కానీ ఆయన ఇమేజ్కి ఆ కథ సరిపోతుందో లేదోననే అనుమానంతో అడగలేకపోయానని తనే చెబుతున్నాడు. సీక్వెల్కి మాత్రం పవన్ని ఎలాగైనా కమిట్ చేయించాలని డిసైడ్ చేసుకున్నాడట దేవా.
ఈసారి కాన్సెప్ట్ మరింత సీరియస్ అట. హీరో రోల్ మరింత మెచ్యూర్డ్గానూ ఉంటుందట. కాబట్టి తనకంటే మావయ్య పవన్ అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలడని తేజ్ కూడా అన్నాడట. అయితే పొలిటికల్ కాన్సెప్ట్ అంటే కాస్త రిస్కే. ఎవరి మనోభావాలూ దెబ్బ తినకుండా, తన పొలిటికల్ కెరీర్కి దెబ్బ తగలకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. విమర్శలకు తావు లేకుండా సినిమాని తీయగలగాలి. కాబట్టి పవన్ ఓకే అంటారా లేదా అనే దానిపైనే ఈ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది.
This post was last modified on December 23, 2021 10:51 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…