‘ఆర్ఆర్ఆర్’ సినిమాను దేశవ్యాప్తంగా ఏ రేంజిలో ప్రమోట్ చేస్తున్నారో తెలిసిందే. రెండు నెలల కిందట రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర్నుంచే ప్రమోషన్ జోరు మొదలైంది కానీ.. ఈ నెల రెండో వారంలో ట్రైలర్ లాంచ్ చేశాక హంగామా మరో స్థాయికి వెళ్లింది. ఇక అప్పట్నుంచి ఆపకుండా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇటీవలే ముంబయిలో భారీ స్థాయిలో ఒక ప్రమోషనల్ ఈవెంట్ చేయడమే కాక ప్రొ కబడ్డీ కొత్త సీజన్ లాంచింగ్ వేడుకల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ టీం హడావుడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పట్నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీం ఏ ఒక్క రోజునూ ఖాళీగా వదిలేలా లేదు. ప్రతి రోజూ ఆఫ్ లైన్లోనో ఆన్ లైన్లోనో ఏదో ఒక ప్రమోషన్ ఉండేలా చూసుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొమరం భీమ్ థీమ్ సాంగ్ లాంచ్కు రంగం సిద్ధమైంది. ఐతే ఇప్పుడు రిలీజ్ చేయబోయే పాట సినిమాలోని విజువల్స్తో ఉండదు.
దోస్తీ సాంగ్ తరహాలోనే దీనికి కూడా ప్రమోషనల్ సాంగ్ రెడీ చేశారు.కొమరం భీముడో కొమరం భీముడో అంటూ సాగే ఈ పాటను కీరవాణి తనయుడు కాలభైరవ ఆలపించడం విశేషం. లెజెండరీ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ ఈ పాట రాశారు. ఈ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. చాలా రిచ్గానే ప్రోమో సాంగ్ను తీర్చిదిద్దనట్లు కనిపిస్తోంది. దీని కోసం చెప్పుకోదగ్గ స్థాయిలోనే బడ్జెట్ పెట్టినట్లు, ఒక కాన్సెప్ట్ ప్రకారం దీన్ని తీర్చిదిద్దారని అర్థమవుతోంది.
మామూలుగా సినిమాలో పాటలకు ఎంత హంగామా ఉంటుందో.. ప్రమోషనల్ సాంగ్స్కే అంత చేస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ టీం. ఇలాంటివి రాజమౌళికే చెల్లు అని చర్చించుకుంటున్నారు జనాలు. ఈ పాటను చిత్రీకరించడానికి వేరే ఫొటోగ్రాఫర్ను పెట్టుకోవడం విశేషం. అతనేమీ ఆషామాషీ టెక్నీషియన్ కాదు. ఇండియాలో టాప్ సినిమాటోగ్రాఫర్స్లో ఒకడైన రిషి పంజాబి ఈ చిత్రానికి పని చేశాడు. ఈ పాట కాన్సెప్ట్, విజువలైజేషన్ అంతా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షితే చూసుకున్నాడు. వినడానికి, చూడ్డానికి ఈ పాట చాలా బాగుండేట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 23, 2021 3:26 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…