ఈ ఏడాది ఆరంభానికి ముందు నందమూరి బాలకృష్ణ పరిస్థితి ఏ రకంగానూ బాగా లేదు. 2019 ఆయనకు దారుణమైన అనుభవాలను మిగిల్చింది. ఏదో అనుకుని తన తండ్రి బయోపిక్ తీస్తే రెండు భాగాలూ తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆ తర్వాత రూలర్ అనే సినిమా చేస్తే అదీ పెద్ద డిజాస్టర్ అయింది. ఇక రాజకీయంగా చూస్తే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం బాలయ్య డీలా పడేలా చేసింది.
2020లో బాలయ్య బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే.. కరోనా కారణంగా ఆయన సినిమా ఏదీ విడుదల కాలేదు. 2021లో పరిస్థితులు మెరుగవడానికి చాలా టైం పట్టింది. అఖండ రిలీజ్ మీద ఎడతెగని సస్పెన్స్ నెలకొంది. అసలీ ఏడాది ఈ చిత్రం విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి. చివరికి డిసెంబరు 2న ఈ చిత్రం థియేటర్లలోకి దిగింది.
ఐతే ఆలస్యం అయితే అయింది కానీ.. ఈ చిత్రానికి అనూహ్యమైన ప్రి రిలీజ్ హైప్ వచ్చింది. ఇక బాక్సాఫీస్ దగ్గర అఖండ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య కెరీర్లో ఈ దశలో థియేటర్లలో ఇలాంటి సంబరాలు తీసుకొస్తాడని.. ఇలా వసూళ్ల మోత మోగిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అఖండ బాలయ్య కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఆయన కెరీర్కు కొత్త ఊపును తీసుకొచ్చింది. ఈ రకంగా బాలయ్యకు 2021 మరపు రాని ఏడాదే. బాలయ్యకు ఇంకో రకంగా కూడా 2021 చాలా స్పెషల్. ఎన్నడూ లేని విధంగా, ఊహించని రీతిలో ఆయన టీవీ హోస్ట్ అవతారం ఎత్తారు.
ఆహా ఓటీటీ కోసం అన్ స్టాపబుల్ షో చేశారు. ఈ షో గురించి ప్రకటన వచ్చినపుడు బాలయ్యతో టాక్ షోనా అని చాలామంది అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో ఈ కొత్త అవతారంలో బాలయ్య సూపర్ సక్సెస్ అయ్యారు. బాలయ్యను మామూలుగ కామెడీ చేసేవాళ్లు కూడా ఈ షోలో ఆయన హోస్టింగ్ స్కిల్స్ చూసి ఔరా అంటున్నారు. బాలయ్య షో కోసమే పెద్ద ఎత్తున ఆహా సబ్స్క్రిప్షన్లు తీసుకునేంత క్రేజ్ వచ్చింది. మొత్తంగా చూస్తే టాలీవుడ్ వరకు 2021 బాలయ్యదే అనడంలో మరో మాట లేదు.
This post was last modified on December 23, 2021 12:17 pm
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…