సంక్రాంతి కానుకగా ‘రాధేశ్యామ్’ రిలీజ్ కాబోతోంది. రేపు ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఇంతలో ఓ టీజర్తో ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేసింది టీమ్. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్పై దృష్టి పెట్టిన మేకర్స్.. సడెన్ అప్డేట్స్ని విడుదల చేస్తూ మూవీపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఆమధ్య వరుస పాటల్ని వదిలారు. ఇప్పుడు టీజర్తో వచ్చారు. ట్రైలర్ రాబోతోంది అంటూ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ చాలా ఇంటరెస్టింగ్గా ఉంది. ‘నా పేరు విక్రమాదిత్య. నేను దేవుణ్ని కాదు. అలా అని మీలో ఒకణ్ని కూడా కాదు’ అంటూ బేస్ వాయిస్తో ప్రభాస్ ఇంగ్లిష్లో చెప్పిన డైలాగ్స్ కాన్సెప్ట్పై క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.
అయితే ఇప్పటికీ రాధేశ్యామ్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు. ఎందుకంటే అదే సీజన్లో వస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఆ టీమ్ దేశమంతా చుట్టేస్తోంది. అందరినీ తమ మాటలతో ఆకట్టుకుంటోంది. కానీ రాధేశ్యామ్ టీమ్ మాత్రం ఎవరి కంటికీ కనిపించకుండా ఇప్పటికీ ఇలా ఆన్లైన్లో అప్డేట్స్ వదులుతూ ఉండటం ఫ్యాన్స్కి రుచించడం లేదు.
నిజానికి రాధేశ్యామ్పై బజ్ తగ్గిపోయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సినిమాని నాలుగేళ్లు చెక్కడం, చాలా కాలం పాటు సరిగ్గా అప్డేట్స్ ఇవ్వకపోవడం వంటివి మెల్లమెల్లగా మూవీపై ఆసక్తిని తగ్గించేశాయని అంటున్నారు. అలాంటప్పుడు ప్రమోషన్స్ అయినా పీక్స్లో ఉండాలి కదా. ఏదో ఒక ఈవెంట్ పెట్టేస్తే సరిపోదు కదా. అలా జరగడం లేదేంటి, అసలు టీమ్కే సినిమాపై నమ్మకం పోయిందా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. దీనికి మేకర్స్ ఏమంటారో మరి.
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…