సంక్రాంతి కానుకగా ‘రాధేశ్యామ్’ రిలీజ్ కాబోతోంది. రేపు ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఇంతలో ఓ టీజర్తో ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేసింది టీమ్. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్పై దృష్టి పెట్టిన మేకర్స్.. సడెన్ అప్డేట్స్ని విడుదల చేస్తూ మూవీపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఆమధ్య వరుస పాటల్ని వదిలారు. ఇప్పుడు టీజర్తో వచ్చారు. ట్రైలర్ రాబోతోంది అంటూ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ చాలా ఇంటరెస్టింగ్గా ఉంది. ‘నా పేరు విక్రమాదిత్య. నేను దేవుణ్ని కాదు. అలా అని మీలో ఒకణ్ని కూడా కాదు’ అంటూ బేస్ వాయిస్తో ప్రభాస్ ఇంగ్లిష్లో చెప్పిన డైలాగ్స్ కాన్సెప్ట్పై క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.
అయితే ఇప్పటికీ రాధేశ్యామ్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు. ఎందుకంటే అదే సీజన్లో వస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఆ టీమ్ దేశమంతా చుట్టేస్తోంది. అందరినీ తమ మాటలతో ఆకట్టుకుంటోంది. కానీ రాధేశ్యామ్ టీమ్ మాత్రం ఎవరి కంటికీ కనిపించకుండా ఇప్పటికీ ఇలా ఆన్లైన్లో అప్డేట్స్ వదులుతూ ఉండటం ఫ్యాన్స్కి రుచించడం లేదు.
నిజానికి రాధేశ్యామ్పై బజ్ తగ్గిపోయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సినిమాని నాలుగేళ్లు చెక్కడం, చాలా కాలం పాటు సరిగ్గా అప్డేట్స్ ఇవ్వకపోవడం వంటివి మెల్లమెల్లగా మూవీపై ఆసక్తిని తగ్గించేశాయని అంటున్నారు. అలాంటప్పుడు ప్రమోషన్స్ అయినా పీక్స్లో ఉండాలి కదా. ఏదో ఒక ఈవెంట్ పెట్టేస్తే సరిపోదు కదా. అలా జరగడం లేదేంటి, అసలు టీమ్కే సినిమాపై నమ్మకం పోయిందా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. దీనికి మేకర్స్ ఏమంటారో మరి.
This post was last modified on December 22, 2021 1:31 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…