సంక్రాంతి కానుకగా ‘రాధేశ్యామ్’ రిలీజ్ కాబోతోంది. రేపు ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఇంతలో ఓ టీజర్తో ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేసింది టీమ్. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్పై దృష్టి పెట్టిన మేకర్స్.. సడెన్ అప్డేట్స్ని విడుదల చేస్తూ మూవీపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఆమధ్య వరుస పాటల్ని వదిలారు. ఇప్పుడు టీజర్తో వచ్చారు. ట్రైలర్ రాబోతోంది అంటూ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ చాలా ఇంటరెస్టింగ్గా ఉంది. ‘నా పేరు విక్రమాదిత్య. నేను దేవుణ్ని కాదు. అలా అని మీలో ఒకణ్ని కూడా కాదు’ అంటూ బేస్ వాయిస్తో ప్రభాస్ ఇంగ్లిష్లో చెప్పిన డైలాగ్స్ కాన్సెప్ట్పై క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.
అయితే ఇప్పటికీ రాధేశ్యామ్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు. ఎందుకంటే అదే సీజన్లో వస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఆ టీమ్ దేశమంతా చుట్టేస్తోంది. అందరినీ తమ మాటలతో ఆకట్టుకుంటోంది. కానీ రాధేశ్యామ్ టీమ్ మాత్రం ఎవరి కంటికీ కనిపించకుండా ఇప్పటికీ ఇలా ఆన్లైన్లో అప్డేట్స్ వదులుతూ ఉండటం ఫ్యాన్స్కి రుచించడం లేదు.
నిజానికి రాధేశ్యామ్పై బజ్ తగ్గిపోయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సినిమాని నాలుగేళ్లు చెక్కడం, చాలా కాలం పాటు సరిగ్గా అప్డేట్స్ ఇవ్వకపోవడం వంటివి మెల్లమెల్లగా మూవీపై ఆసక్తిని తగ్గించేశాయని అంటున్నారు. అలాంటప్పుడు ప్రమోషన్స్ అయినా పీక్స్లో ఉండాలి కదా. ఏదో ఒక ఈవెంట్ పెట్టేస్తే సరిపోదు కదా. అలా జరగడం లేదేంటి, అసలు టీమ్కే సినిమాపై నమ్మకం పోయిందా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. దీనికి మేకర్స్ ఏమంటారో మరి.
This post was last modified on December 22, 2021 1:31 pm
మాములుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టరని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ…
https://www.youtube.com/watch?v=kR4Y4m3FyhU&t=225s హాస్యానికి మారుపేరుగా ఇప్పటి భాషలో చెప్పాలంటే మీమ్ గాడ్ గా చెప్పుకునే బ్రహ్మానందంకు నట వారసత్వం రూపంలో రాజా…
ఏదైనా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేస్తారు. బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందాని ఇరు జట్ల కెప్టెన్లు ఎదురు…
బీజేపీ, బీఎస్పీ అధినేత మాయావతిల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ బీఎస్పీ మాయావతి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులు డబుల్ ఇస్మార్ట్ విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అన్నీ సవ్యంగా…
400 సీట్ల నినాదం. 370 స్థానాలలో విజయం సాధించాలన్న ప్రణాళిక. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో…