Movie News

హీరోయిన్ ను వేధిస్తోన్న వ్యక్తి అరెస్ట్!

ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ.. ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు డిసెంబర్ 20న వేధింపులకు గురి చేస్తోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా పార్వతి వెంటపడుతూ ఆమెని వేధిస్తున్నాడు.

కొన్ని రోజులుగా డెలివరీ బాయ్ గెటప్ లో ఫుడ్ పార్శిల్స్ ను తీసుకొని ఏకంగా పార్వతి ఇంటికొచ్చి మరీ రచ్చ చేస్తున్నాడట. దీంతో ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించినా.. అతడు వినలేదట. పార్వతిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడట. సెక్యూరిటీతో కూడా గొడవ పెట్టుకునేవాడట. ఇలా కొంతకాలంగా వేధిస్తూనే.. మరోపక్క తన మొబైల్ ఫోన్ కి అసభ్యకర రీతిలో మెసేజ్ లు పెడుతున్నాడంటూ పార్వతి పోలీసులకు వెల్లడించింది.

పార్వతి ఫిర్యాదు మేరకు హర్ష అనే వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతడు కస్టడీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కూడా పార్వతి ఇలానే మరోవ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిషోర్ అనే వ్యక్తి తాను లాయర్, ఫిల్మ్ మేకర్ అని చెప్పి.. పార్వతిని, ఆమె కుటుంబసభ్యులను పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మెల్లగా పార్వతిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాలయంలో పార్వతికి నటిగా మంచి పేరుంది. ‘బెంగుళూరు డేస్’, ‘ ఉయిరే’ వంటి హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈ ఏడాది విడుదలైన ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఓ ఎపిసోడ్ లో కనిపించింది పార్వతి.

This post was last modified on December 22, 2021 10:45 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

12 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

14 hours ago