ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ.. ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు డిసెంబర్ 20న వేధింపులకు గురి చేస్తోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా పార్వతి వెంటపడుతూ ఆమెని వేధిస్తున్నాడు.
కొన్ని రోజులుగా డెలివరీ బాయ్ గెటప్ లో ఫుడ్ పార్శిల్స్ ను తీసుకొని ఏకంగా పార్వతి ఇంటికొచ్చి మరీ రచ్చ చేస్తున్నాడట. దీంతో ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించినా.. అతడు వినలేదట. పార్వతిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడట. సెక్యూరిటీతో కూడా గొడవ పెట్టుకునేవాడట. ఇలా కొంతకాలంగా వేధిస్తూనే.. మరోపక్క తన మొబైల్ ఫోన్ కి అసభ్యకర రీతిలో మెసేజ్ లు పెడుతున్నాడంటూ పార్వతి పోలీసులకు వెల్లడించింది.
పార్వతి ఫిర్యాదు మేరకు హర్ష అనే వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతడు కస్టడీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కూడా పార్వతి ఇలానే మరోవ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిషోర్ అనే వ్యక్తి తాను లాయర్, ఫిల్మ్ మేకర్ అని చెప్పి.. పార్వతిని, ఆమె కుటుంబసభ్యులను పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మెల్లగా పార్వతిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాలయంలో పార్వతికి నటిగా మంచి పేరుంది. ‘బెంగుళూరు డేస్’, ‘ ఉయిరే’ వంటి హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈ ఏడాది విడుదలైన ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఓ ఎపిసోడ్ లో కనిపించింది పార్వతి.
This post was last modified on December 22, 2021 10:45 am
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…