Movie News

హీరోయిన్ ను వేధిస్తోన్న వ్యక్తి అరెస్ట్!

ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ.. ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు డిసెంబర్ 20న వేధింపులకు గురి చేస్తోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా పార్వతి వెంటపడుతూ ఆమెని వేధిస్తున్నాడు.

కొన్ని రోజులుగా డెలివరీ బాయ్ గెటప్ లో ఫుడ్ పార్శిల్స్ ను తీసుకొని ఏకంగా పార్వతి ఇంటికొచ్చి మరీ రచ్చ చేస్తున్నాడట. దీంతో ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించినా.. అతడు వినలేదట. పార్వతిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడట. సెక్యూరిటీతో కూడా గొడవ పెట్టుకునేవాడట. ఇలా కొంతకాలంగా వేధిస్తూనే.. మరోపక్క తన మొబైల్ ఫోన్ కి అసభ్యకర రీతిలో మెసేజ్ లు పెడుతున్నాడంటూ పార్వతి పోలీసులకు వెల్లడించింది.

పార్వతి ఫిర్యాదు మేరకు హర్ష అనే వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతడు కస్టడీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కూడా పార్వతి ఇలానే మరోవ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిషోర్ అనే వ్యక్తి తాను లాయర్, ఫిల్మ్ మేకర్ అని చెప్పి.. పార్వతిని, ఆమె కుటుంబసభ్యులను పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మెల్లగా పార్వతిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాలయంలో పార్వతికి నటిగా మంచి పేరుంది. ‘బెంగుళూరు డేస్’, ‘ ఉయిరే’ వంటి హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈ ఏడాది విడుదలైన ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఓ ఎపిసోడ్ లో కనిపించింది పార్వతి.

This post was last modified on December 22, 2021 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

58 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

2 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago