తెలుగు సినిమాల్లో ఇతర భాషా నటీనటులకు ఎప్పుడూ స్థానం ఉంటూనే ఉంది. అయితే ఇటీవలి కాలంలో మలయాళ యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆల్రెడీ మోహన్లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ మన సినిమాల్లో నటించారు. రీసెంట్గా ‘పుష్ప’ కోసం వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ వచ్చాడు. ఈ కోవలో మరో నటుడు కూడా ఉన్నాడు. తనే ఉన్ని ముకుందన్.
‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి మార్కులే వేయించుకున్నాడు ముకుందన్. ఆ తర్వాత ‘భాగమతి’లో అనుష్కకి జోడీగా నటించాడు. అందులో తన పాత్ర నిడివి కొంచెమే అయినా చక్కగా నటించి మెప్పించాడు. రీసెంట్గా రవితేజ ‘ఖిలాడీ’లోనూ జాయినయ్యాడు. ఇప్పుడు సమంత నటిస్తున్న ‘యశోద’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు.
హరి, హరీష్ అనే కొత్త దర్శకులతో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ‘యశోద’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. సమంత లీడ్ రోల్ చేస్తోంది. వరలక్ష్మీ శరత్కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఉన్ని ముకుందన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడంటూ ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమా కథలాగే పాత్రలు కూడా కొత్తగా ఉంటాయట. ముకుందన్ పోషిస్తున్న గౌతమ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఫిమేల్ సెంట్రిక్ మూవీ కనుక, ఇంతవరకు మరే హీరో పేరూ ప్రకటించలేదు కనుక అతడు సమంతకి జోడీ అయ్యే చాన్స్ ఉంది.
ఈ మూవీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో మొదలయ్యింది. సమంత, వరలక్ష్మి షూట్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ముకుందన్ కూడా జాయినయ్యాడు. ఇది ప్యాన్ ఇండియా ఫిల్మ్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రూపొందుతోంది. అందుకే అన్ని భాషల నటీనటులకూ చోటు కల్పిస్తున్నారు మేకర్స్. ముందు ముందు ఇంకెవరు యాడ్ అవుతారో మరి.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…