బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. ఆ సినిమాకు రిలీజ్ ముంగిట వచ్చిన హైప్ అలాంటిలాంటిది కాదు. అందుక్కారణం అది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపించడమే. ఆ సినిమాకు అంతిమంగా ఆశించిన ఫలితం రాకున్నా.. ప్రి రిలీజ్ హైప్, బుకింగ్స్, ఓపెనింగ్స్ విషయంలో తిరుగులేదు. అలాంటి యుఫోరియా ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ విషయంలో కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం ఇది లవ్ స్టోరీ కావడం, మాస్, యాక్షన్ అంశాలు లేకపోవడం.
ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా ఈ సినిమాకు ఆశించినంత బజ్ రాలేదు. ఇదొక ట్రాజిక్ లవ్ స్టోరీ అన్న సంకేతాలు కనిపిస్తుండటంతో ప్రభాస్ అభిమానులు కొంచెం టెన్షన్ పడుతున్న మాట వాస్తవం. ఇలాంటి టైంలో ఇప్పుడీ చిత్రం నుంచి కృష్ణం రాజు లుక్ రిలీజ్ చేయడంతో చాలామంది నెగెటివ్గానే స్పందిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులైతే సినిమా విషయంలో మరింత టెన్షన్ పడిపోతున్నారు కృష్ణంరాజు లుక్ చూసి. తన పెదనాన్నతో ప్రభాస్ కలిసి చేసిన ప్రతిసారీ చేదు అనుభవాలే ఎదురు కావడమే ఇందుకు కారణం. తొలిసారి వీళ్లిద్దరూ కలిసి బిల్లాలో నటించారు. అందులో కృష్ణంరాజు క్యారెక్టర్ కామెడీ అయిపోయింది. సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత రెబల్ కోసం ఇద్దరూ జట్టు కడితే ఫలితమేంటో తెలిసిందే. అందులోనూ కృష్ణంరాజు పాత్ర పండలేదు.
గత రెండు దశాబ్దాల్లో కృష్ణం రాజు నటించిన ఏ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయింది లేదు. ఆయన్నో నెగెటివ్ సెంటిమెంటుగా భావిస్తున్నారు. పైగా రాధేశ్యామ్లో ఆయన లుక్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ తరహా పాత్ర కృష్ణంరాజుకు ఏమాత్రం సెట్ అవుతుందో.. సినిమాకు ఈ పాత్ర ఏమేర ఉపయోగపడుతుందో అన్న భయాలు కలుగుతున్నాయి. మరి దర్శకుడు రాధాకృష్ణకుమార్ కృష్ణంరాజు విషయంలో నెలకొన్న నెగెటివ్ సెంటిమెంట్లను చెరిపేస్తాడేమో చూడాలి.
This post was last modified on December 20, 2021 11:09 pm
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…