సరైన సినిమాలు పడక ఒక స్థాయికి మించి ఎదగలేకపోతున్నాడు కానీ.. తెలుగులో ఉన్న మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు. కేవలం నటన విషయంలోనే కాదు.. లుక్స్ విషయంలోనూ అతను చాలామంది స్టార్లను మించి స్కోర్ చేస్తాడు. కానీ బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల, పేరున్న దర్శకులతో సరైన సినిమాలు చేయకపోవడం వల్ల సత్యదేవ్కు సరైన బ్రేక్ రాలేదు. ఐతే తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సత్యదేవ్కు నటుడిగా మాత్రం మంచి మార్కులే పడుతుంటాయి.
ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన తిమ్మరసు, స్కైలాబ్ సినిమాలు కమర్షియల్గా అనుకున్నంత ఆడకపోయినా సత్యదేవ్ పెర్ఫామెన్స్ అందరినీ మెప్పించింది. ఇప్పుడతను ‘గాడ్సే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకుముందు సత్యదేవ్తో ‘బ్లఫ్ మాస్టర్’ తీసిన గోపీగణేష్ పట్టాభి రూపొందించిన చిత్రమిది.
ఈ రోజే ‘గాడ్సే’ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో పూర్తిగా సత్యదేవ్ డామినేషన్ కనిపించింది. అవినీతి పరులైన రాజకీయ నాయకులపై యుద్ధం చేసే రెబలియన్ పాత్రలో కనిపించనున్నాడు సత్యదేవ్. ‘‘ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’’ అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత వ్యవస్థకు సవాలు విసురుతున్న హీరో (గాడ్సే)ను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసాఫీసర్గా ఐశ్వర్యా లక్ష్మి (జగమే తంత్రం హీరోయిన్) రంగంలోకి దిగింది. గాడ్సే లక్ష్యం సేవ పేరుతో జనాల్ని దోచుకు తింటున్న రాజకీయ నాయకులను హీరో టార్గెట్ చేయడం.. హీరోను పట్టుకోవడానికి వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగడం.. ఈ కోణంలో కథ నడిచేలా కనిపిస్తోంది.
ఒంటికి టైం బాంబు తగిలించుకుని రాజకీయ నాయకుల దోపిడీ గురించి డైలాగ్ చెప్పే షాట్ చూస్తే నటుడిగా సత్యదేవ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నామనిపిస్తోంది. అతడి స్థాయికి మించి ఈ సినిమా మీద నిర్మాత సి.కళ్యాణ్ భారీగానే ఖర్చు పెట్టినట్లున్నాడు. టీజర్లో విజువల్స్, కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్ అంత రిచ్గా కనిపించాయి. మరి ఈ సినిమాతో సత్యదేవ్ కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి.
This post was last modified on December 20, 2021 11:05 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…