సరైన సినిమాలు పడక ఒక స్థాయికి మించి ఎదగలేకపోతున్నాడు కానీ.. తెలుగులో ఉన్న మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు. కేవలం నటన విషయంలోనే కాదు.. లుక్స్ విషయంలోనూ అతను చాలామంది స్టార్లను మించి స్కోర్ చేస్తాడు. కానీ బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల, పేరున్న దర్శకులతో సరైన సినిమాలు చేయకపోవడం వల్ల సత్యదేవ్కు సరైన బ్రేక్ రాలేదు. ఐతే తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సత్యదేవ్కు నటుడిగా మాత్రం మంచి మార్కులే పడుతుంటాయి.
ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన తిమ్మరసు, స్కైలాబ్ సినిమాలు కమర్షియల్గా అనుకున్నంత ఆడకపోయినా సత్యదేవ్ పెర్ఫామెన్స్ అందరినీ మెప్పించింది. ఇప్పుడతను ‘గాడ్సే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకుముందు సత్యదేవ్తో ‘బ్లఫ్ మాస్టర్’ తీసిన గోపీగణేష్ పట్టాభి రూపొందించిన చిత్రమిది.
ఈ రోజే ‘గాడ్సే’ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో పూర్తిగా సత్యదేవ్ డామినేషన్ కనిపించింది. అవినీతి పరులైన రాజకీయ నాయకులపై యుద్ధం చేసే రెబలియన్ పాత్రలో కనిపించనున్నాడు సత్యదేవ్. ‘‘ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’’ అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత వ్యవస్థకు సవాలు విసురుతున్న హీరో (గాడ్సే)ను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసాఫీసర్గా ఐశ్వర్యా లక్ష్మి (జగమే తంత్రం హీరోయిన్) రంగంలోకి దిగింది. గాడ్సే లక్ష్యం సేవ పేరుతో జనాల్ని దోచుకు తింటున్న రాజకీయ నాయకులను హీరో టార్గెట్ చేయడం.. హీరోను పట్టుకోవడానికి వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగడం.. ఈ కోణంలో కథ నడిచేలా కనిపిస్తోంది.
ఒంటికి టైం బాంబు తగిలించుకుని రాజకీయ నాయకుల దోపిడీ గురించి డైలాగ్ చెప్పే షాట్ చూస్తే నటుడిగా సత్యదేవ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నామనిపిస్తోంది. అతడి స్థాయికి మించి ఈ సినిమా మీద నిర్మాత సి.కళ్యాణ్ భారీగానే ఖర్చు పెట్టినట్లున్నాడు. టీజర్లో విజువల్స్, కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్ అంత రిచ్గా కనిపించాయి. మరి ఈ సినిమాతో సత్యదేవ్ కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి.
This post was last modified on December 20, 2021 11:05 pm
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…