సరైన సినిమాలు పడక ఒక స్థాయికి మించి ఎదగలేకపోతున్నాడు కానీ.. తెలుగులో ఉన్న మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు. కేవలం నటన విషయంలోనే కాదు.. లుక్స్ విషయంలోనూ అతను చాలామంది స్టార్లను మించి స్కోర్ చేస్తాడు. కానీ బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల, పేరున్న దర్శకులతో సరైన సినిమాలు చేయకపోవడం వల్ల సత్యదేవ్కు సరైన బ్రేక్ రాలేదు. ఐతే తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సత్యదేవ్కు నటుడిగా మాత్రం మంచి మార్కులే పడుతుంటాయి.
ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన తిమ్మరసు, స్కైలాబ్ సినిమాలు కమర్షియల్గా అనుకున్నంత ఆడకపోయినా సత్యదేవ్ పెర్ఫామెన్స్ అందరినీ మెప్పించింది. ఇప్పుడతను ‘గాడ్సే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకుముందు సత్యదేవ్తో ‘బ్లఫ్ మాస్టర్’ తీసిన గోపీగణేష్ పట్టాభి రూపొందించిన చిత్రమిది.
ఈ రోజే ‘గాడ్సే’ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో పూర్తిగా సత్యదేవ్ డామినేషన్ కనిపించింది. అవినీతి పరులైన రాజకీయ నాయకులపై యుద్ధం చేసే రెబలియన్ పాత్రలో కనిపించనున్నాడు సత్యదేవ్. ‘‘ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’’ అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత వ్యవస్థకు సవాలు విసురుతున్న హీరో (గాడ్సే)ను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసాఫీసర్గా ఐశ్వర్యా లక్ష్మి (జగమే తంత్రం హీరోయిన్) రంగంలోకి దిగింది. గాడ్సే లక్ష్యం సేవ పేరుతో జనాల్ని దోచుకు తింటున్న రాజకీయ నాయకులను హీరో టార్గెట్ చేయడం.. హీరోను పట్టుకోవడానికి వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగడం.. ఈ కోణంలో కథ నడిచేలా కనిపిస్తోంది.
ఒంటికి టైం బాంబు తగిలించుకుని రాజకీయ నాయకుల దోపిడీ గురించి డైలాగ్ చెప్పే షాట్ చూస్తే నటుడిగా సత్యదేవ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నామనిపిస్తోంది. అతడి స్థాయికి మించి ఈ సినిమా మీద నిర్మాత సి.కళ్యాణ్ భారీగానే ఖర్చు పెట్టినట్లున్నాడు. టీజర్లో విజువల్స్, కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్ అంత రిచ్గా కనిపించాయి. మరి ఈ సినిమాతో సత్యదేవ్ కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి.
This post was last modified on December 20, 2021 11:05 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…