సరైన సినిమాలు పడక ఒక స్థాయికి మించి ఎదగలేకపోతున్నాడు కానీ.. తెలుగులో ఉన్న మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు. కేవలం నటన విషయంలోనే కాదు.. లుక్స్ విషయంలోనూ అతను చాలామంది స్టార్లను మించి స్కోర్ చేస్తాడు. కానీ బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల, పేరున్న దర్శకులతో సరైన సినిమాలు చేయకపోవడం వల్ల సత్యదేవ్కు సరైన బ్రేక్ రాలేదు. ఐతే తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సత్యదేవ్కు నటుడిగా మాత్రం మంచి మార్కులే పడుతుంటాయి.
ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన తిమ్మరసు, స్కైలాబ్ సినిమాలు కమర్షియల్గా అనుకున్నంత ఆడకపోయినా సత్యదేవ్ పెర్ఫామెన్స్ అందరినీ మెప్పించింది. ఇప్పుడతను ‘గాడ్సే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకుముందు సత్యదేవ్తో ‘బ్లఫ్ మాస్టర్’ తీసిన గోపీగణేష్ పట్టాభి రూపొందించిన చిత్రమిది.
ఈ రోజే ‘గాడ్సే’ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో పూర్తిగా సత్యదేవ్ డామినేషన్ కనిపించింది. అవినీతి పరులైన రాజకీయ నాయకులపై యుద్ధం చేసే రెబలియన్ పాత్రలో కనిపించనున్నాడు సత్యదేవ్. ‘‘ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’’ అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత వ్యవస్థకు సవాలు విసురుతున్న హీరో (గాడ్సే)ను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసాఫీసర్గా ఐశ్వర్యా లక్ష్మి (జగమే తంత్రం హీరోయిన్) రంగంలోకి దిగింది. గాడ్సే లక్ష్యం సేవ పేరుతో జనాల్ని దోచుకు తింటున్న రాజకీయ నాయకులను హీరో టార్గెట్ చేయడం.. హీరోను పట్టుకోవడానికి వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగడం.. ఈ కోణంలో కథ నడిచేలా కనిపిస్తోంది.
ఒంటికి టైం బాంబు తగిలించుకుని రాజకీయ నాయకుల దోపిడీ గురించి డైలాగ్ చెప్పే షాట్ చూస్తే నటుడిగా సత్యదేవ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నామనిపిస్తోంది. అతడి స్థాయికి మించి ఈ సినిమా మీద నిర్మాత సి.కళ్యాణ్ భారీగానే ఖర్చు పెట్టినట్లున్నాడు. టీజర్లో విజువల్స్, కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్ అంత రిచ్గా కనిపించాయి. మరి ఈ సినిమాతో సత్యదేవ్ కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి.
This post was last modified on December 20, 2021 11:05 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…