ఆల్రెడీ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. ఇప్పుడు మరో దర్శకుడి కూతురు కూడా తెరంగేట్రం చేస్తోంది. ఆమె మరెవరో కాదు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కూతురు అదితి. కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘విరుమాన్’ మూవీతో ఆమె నటిగా తొలి అడుగు వేస్తోంది. అదింకా సెట్స్పై ఉండగానే శింబు సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శింబు హీరోగా గోకుల్ డైరెక్షన్లో ‘కరోనా కుమార్’ అనే చిత్రం రానుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ‘వెందు తుణీందదు కాడు’ చిత్రంతో బిజీగా ఉన్న శింబు.. అది పూర్తయ్యాక ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా అదితి ఫైనల్ అయ్యింది. త్వరలో అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది.
అదితి బేసిగ్గా డాక్టర్. ఇటీవలే పట్టా పుచ్చుకుంది. కానీ ఆమెకి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశ. దాంతో ఓవైపు మెడిసిన్ చదువుతూనే సినిమాలపై దృష్టి పెట్టింది. అదితి అందంగా ఉంటుంది. పైగా స్వయానా శంకర్ కూతురు కూడా కాబట్టి వరుస అవకాశాలు వచ్చి బ్యాగ్లో పడుతున్నాయి. ఆమె ప్రయాణం ప్రారంభం నుంచే జెట్ స్పీడులో సాగుతోంది. మరి నటిగా ఎన్ని మార్కులు వేయించుకుంటుందో.. ఏదో ఒక రోజు తన తండ్రి సినిమాలో హీరోయిన్గా నటించే స్థాయికి చేరుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on December 20, 2021 7:40 pm
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…