ఆల్రెడీ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. ఇప్పుడు మరో దర్శకుడి కూతురు కూడా తెరంగేట్రం చేస్తోంది. ఆమె మరెవరో కాదు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కూతురు అదితి. కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘విరుమాన్’ మూవీతో ఆమె నటిగా తొలి అడుగు వేస్తోంది. అదింకా సెట్స్పై ఉండగానే శింబు సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శింబు హీరోగా గోకుల్ డైరెక్షన్లో ‘కరోనా కుమార్’ అనే చిత్రం రానుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ‘వెందు తుణీందదు కాడు’ చిత్రంతో బిజీగా ఉన్న శింబు.. అది పూర్తయ్యాక ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా అదితి ఫైనల్ అయ్యింది. త్వరలో అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది.
అదితి బేసిగ్గా డాక్టర్. ఇటీవలే పట్టా పుచ్చుకుంది. కానీ ఆమెకి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశ. దాంతో ఓవైపు మెడిసిన్ చదువుతూనే సినిమాలపై దృష్టి పెట్టింది. అదితి అందంగా ఉంటుంది. పైగా స్వయానా శంకర్ కూతురు కూడా కాబట్టి వరుస అవకాశాలు వచ్చి బ్యాగ్లో పడుతున్నాయి. ఆమె ప్రయాణం ప్రారంభం నుంచే జెట్ స్పీడులో సాగుతోంది. మరి నటిగా ఎన్ని మార్కులు వేయించుకుంటుందో.. ఏదో ఒక రోజు తన తండ్రి సినిమాలో హీరోయిన్గా నటించే స్థాయికి చేరుకుంటుందో లేదో చూడాలి.
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…