ఆల్రెడీ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. ఇప్పుడు మరో దర్శకుడి కూతురు కూడా తెరంగేట్రం చేస్తోంది. ఆమె మరెవరో కాదు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కూతురు అదితి. కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘విరుమాన్’ మూవీతో ఆమె నటిగా తొలి అడుగు వేస్తోంది. అదింకా సెట్స్పై ఉండగానే శింబు సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శింబు హీరోగా గోకుల్ డైరెక్షన్లో ‘కరోనా కుమార్’ అనే చిత్రం రానుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ‘వెందు తుణీందదు కాడు’ చిత్రంతో బిజీగా ఉన్న శింబు.. అది పూర్తయ్యాక ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా అదితి ఫైనల్ అయ్యింది. త్వరలో అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది.
అదితి బేసిగ్గా డాక్టర్. ఇటీవలే పట్టా పుచ్చుకుంది. కానీ ఆమెకి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశ. దాంతో ఓవైపు మెడిసిన్ చదువుతూనే సినిమాలపై దృష్టి పెట్టింది. అదితి అందంగా ఉంటుంది. పైగా స్వయానా శంకర్ కూతురు కూడా కాబట్టి వరుస అవకాశాలు వచ్చి బ్యాగ్లో పడుతున్నాయి. ఆమె ప్రయాణం ప్రారంభం నుంచే జెట్ స్పీడులో సాగుతోంది. మరి నటిగా ఎన్ని మార్కులు వేయించుకుంటుందో.. ఏదో ఒక రోజు తన తండ్రి సినిమాలో హీరోయిన్గా నటించే స్థాయికి చేరుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on December 20, 2021 7:40 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…