ఆల్రెడీ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. ఇప్పుడు మరో దర్శకుడి కూతురు కూడా తెరంగేట్రం చేస్తోంది. ఆమె మరెవరో కాదు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కూతురు అదితి. కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘విరుమాన్’ మూవీతో ఆమె నటిగా తొలి అడుగు వేస్తోంది. అదింకా సెట్స్పై ఉండగానే శింబు సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శింబు హీరోగా గోకుల్ డైరెక్షన్లో ‘కరోనా కుమార్’ అనే చిత్రం రానుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ‘వెందు తుణీందదు కాడు’ చిత్రంతో బిజీగా ఉన్న శింబు.. అది పూర్తయ్యాక ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా అదితి ఫైనల్ అయ్యింది. త్వరలో అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది.
అదితి బేసిగ్గా డాక్టర్. ఇటీవలే పట్టా పుచ్చుకుంది. కానీ ఆమెకి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశ. దాంతో ఓవైపు మెడిసిన్ చదువుతూనే సినిమాలపై దృష్టి పెట్టింది. అదితి అందంగా ఉంటుంది. పైగా స్వయానా శంకర్ కూతురు కూడా కాబట్టి వరుస అవకాశాలు వచ్చి బ్యాగ్లో పడుతున్నాయి. ఆమె ప్రయాణం ప్రారంభం నుంచే జెట్ స్పీడులో సాగుతోంది. మరి నటిగా ఎన్ని మార్కులు వేయించుకుంటుందో.. ఏదో ఒక రోజు తన తండ్రి సినిమాలో హీరోయిన్గా నటించే స్థాయికి చేరుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on December 20, 2021 7:40 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…