నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ అన్ని రకాలుగా ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. ఇవి ఓటీటీ బాట పట్టడం ముందు నాని అభిమానులకు అస్సలు రుచించలేదు. ఆ తర్వాత అవి అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఇంకా నిరాశకు గురయ్యారు. ఇప్పుడు నాని థియేటర్లలో ఒక సినిమాను రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.
ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’పై చాలా భారమే ఉంది.
ఈ సినిమా ప్రోమోలు చూస్తే ప్రామిసింగ్గానే అనిపిస్తున్నాయి కానీ.. అదే సమయంలో దీని కమర్షియల్ సక్సెస్ మీద కాస్త సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇది చాలా సీరియస్గా సాగే సినిమాలా కనిపిస్తోంది. నాని నుంచి బేసిగ్గా ఆశించే ఎంటర్టైన్మెంట్ కనిపించడం లేదు. శ్యామ్ సింగ రాయ్ క్యారెక్టర్లో హీరోయిజం కనిపిస్తున్నప్పటికీ.. నాని నుంచి మాస్ ఎలివేషన్ల కంటే ఎంటర్టైన్మెంటే ఎక్కువ కోరుకుంటారు ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలో సినిమాకు మంచి టాక్ వచ్చినా ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో అన్న టెన్షన్ అయితే లేకపోలేదు. ‘శ్యామ్ సింగ రాయ్’కున్న మరో పెద్ద ప్రతికూలత.. భారీ సినిమాల మధ్య పడటం. ఇప్పటికే అఖండ, పుష్ప రూపంలో రెండు భారీ చిత్రాలు విడుదలయ్యాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చిన రెండు వారాలకు ‘ఆర్ఆర్ఆర్’ రాబోతోంది. తర్వాత భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ఉన్నాయి. సగటు సినీ ప్రేక్షకుడు ఇలాంటి పెద్ద సినిమాలను టాక్తో సంబంధం లేకుండా చూడాలనుకుంటాడు.
వాటి కోసం చాలా డబ్బులు ఖర్చవుతున్నపుడు.. మధ్యలో ఒక మీడియం రేంజ్ సినిమా వస్తే దాన్ని ఇగ్నోర్ చేసేందుకు ఆస్కారముంది. సినిమా చాలా బాగుందంటే తప్ప అలాంటి సినిమాల వైపు చూడకపోవచ్చు. పైగా వి, టక్ జగదీష్ చిత్రాల వల్ల నాని క్రెడిబిలిటీ కొంచెం తగ్గింది. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’కి ప్రతికూలతలైతే చాలానే కనిపిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో సినిమా నాని కోరుకున్న విజయం అందించాలంటే అసాధారణంగానే ఉండాలి. చూద్దాం నాని, రాహుల్ కలిసి ఎలాంటి చిత్రాన్ని డెలివర్ చేశారో?
This post was last modified on December 19, 2021 7:12 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…